గెలుపు అంచుల వరకు వెళ్లిన మ్యాచ్.. కళ్లముందే చేజారిపోతుండటంతో అభిమానులకే ఆటగాళ్లపై తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతుంది. అయితే ఇది అభిమానులకు మాత్రమే పరిమితం అనుకుంటే పోరబాటే.. జట్టును వెన్నంటి వుండి ప్రోత్సహించే తెరవెనుకనున్న వారు ఏమాత్రం అతీతం కాదు. గెలుపు తీరం చేరిన సందర్భంలో ఒక్కసారిగా మ్యాచ్ గతి మారిపోయేసరికి సన్ రైజర్స్ హైదరాబాద్ ప్రధాన కోచ్ టామ్ మూడీ కన్నీళ్లు పెట్టుకున్న వీడియో ఇప్పుడు నెట్టింట్లో సంచలనంగా మారిపోయింది. ఆయన వీడియో చూసిన హైదరాబాదీ అభిమానులు భావోద్వేగానికి గురవుతున్నారు.
ఢిల్లీ గెలవాలంటే 18 బంతుల్లో 34 పరుగులు కావాలి. అప్పటికే వరుసగా వికెట్లు పడుతుండటంతో సన్ రైజర్స్దే విజయం అనుకున్నారంతా. కానీ థంపీ వేసిన 18వ ఓవర్లో ఢీల్లీ బ్యాట్స్మన్ రిషభ్ పంత్ వరుసగా 4, 6, 4, 6 బాదేశాడు. ఆ ఓవర్ ముగిసిన తర్వాత సమీకరణం 12 బంతుల్లో 12 పరుగులుగా మారింది. దీంతో మ్యాచ్ ఢీల్లీవైపు మొగ్గింది. రిషభ్ పంత్ (49) చెలరేగడంతో ఇంకో బంతి మిగిలి ఉండగానే ఢీల్లీ విజయం సాధించింది. దీంతో సన్ రైజర్స్ టోర్నీ నుంచి నిష్క్రమించకతప్పలేదు. ఈ మ్యాచులో సన్ రైజర్స్ ఓడిపోవటంతో జట్టు కోచ్ టామ్ మూడీ కన్నీళ్ల పర్యంతమయ్యారు.
18వ ఓవర్ వేస్తున్న సమయంలో మ్యాచ్ చేజారిపోతున్న విషయాన్ని గ్రహించిన కోచ్ టామ్ మూడీ కన్నీళ్లు పెట్టాకున్నారు. మరోవైపు మైదానంలో ఉన్న కెప్టెన్ కేన్ విలియమ్సన్ సైతం కొంత బావోద్వేగానికి గురైనట్లు కనిపించాడు. అయితే, దీనికి సబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట్లో వైరల్గా మారింది. దీనిపై స్పందించిన అభిమానులు ఐపీఎల్లో తన జట్టు ఓడిపోతే ఏడ్చిన తొలి కోచ్ మూడీ.. ఈ మ్యాచులో ఇదే చేదు సంఘటన.. క్రికెట్ అంటే కేవలం ఆట మాత్రమే కాదు.. ఇదో భావోద్వేగం అని పేర్కొంటున్నారు. సన్ రైజర్స్ టైటిల్ గెలవకపోవచ్చు. కానీ, అందరి మనసు గెలిచింది అంటూ తమ అభిమానం వ్యక్తం చేస్తున్నారు.
Tom Moody. pic.twitter.com/FACKulM7KB
— Mufaddal Vohra (@mufaddal_vohra) May 8, 2019
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్స్ట్రైకర్ ఎండ్లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more