రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు అంటే ఐపీఎల్ టోర్నీలో హాట్ ఫేవరేట్ జట్టు. కానీ అనూహ్యంగా ఈ సారి ఐపీఎల్ లోనే చివరిస్థానంలోకి జారుకుంది. దీంతో బెంగళూరు ఫ్యాన్స్ తీవ్ర అసంతృప్తికి గురయ్యారు. దీంతో ఈ జట్టులోని స్టార్ బ్యాట్స్మెన్ డివిలియర్స్, జట్టు కెప్టెన్ కోహ్లీలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పర్సనల్ మెసేజ్ షేర్ చేసుకున్నారు. తాము శాయశక్తులా ప్రయత్నించినా ఈ సారి ప్లే అఫ్ కు వెళ్లలేకపోయామని.. అందుకు చింతిస్తున్నట్లు చెప్పారు.
ఈ సీజన్లో రాణించలేక పోయమాని ఒప్పుకుంటూ మీ ఆదరాభిమానాలు ఇలాగే కొనసాగితే వచ్చే సంవత్సరం బాగా రాణిస్తామని నమ్మకాన్ని వ్యక్తపరిచారు. 2019సీజన్లో ఆర్సీబీ ఆడనున్న చివరి మ్యాచ్కు బెంగళూరు వేదికగా జరగనుంది. సన్రైజర్స్ హైదరాబాద్తో మ్యాచ్కు ముందు ఆర్సీబీ ప్లేయర్లు డివిలియర్స్, విరాట్ కోహ్లీ ఓ ప్రత్యేకమైన మెసేజ్ను పంపారు. వర్షంలో ఆగిపోయిన మ్యాచ్ గురించి డివిలియర్స్ మాట్లాడుతూ.. చివరి ఓవర్ అంటే చివరి 5ఓవర్లతో సమానం. ఆ గేమ్ ఫలితం తేలకపోయినప్పటికీ నాకు జీవితాంతం గుర్తుంటుంది' అని వెల్లడించాడు.
కెప్టెన్ విరాట్ కోహ్లీ మాట్లాడుతూ..సీజన్లో ఇంకా మిగిలి ఉంది ఒక మ్యాచ్ మాత్రమే. మేం చేయగలిగినంత చేశాం. చాలా బాధగా ఉంది. సీజన్లో జట్టు ప్రదర్శన మీతో పాటు మమ్మల్ని కూడా నిరాశపరిచింది. వర్షం వచ్చిన్పపటికీ స్టేడియంలో మ్యాచ్ కోసం ఎదురుచూస్తూ ఉండిపోయారు. మీ అందరికీ కృతజ్ఞతలు' అని కోహ్లీ తెలిపాడు. డివిలియర్స్ మరోసారి కలగజేసుకుంటూ.. 'ఇలాగే మీ ప్రోత్సాహం అందిస్తూ ఉండండి. వచ్చే సీజన్లో రాణించేందుకు ప్రయత్నిస్తాం' అని వివరించాడు. బెంగళూరు పేలవ ప్రదర్శనతో ప్లేఆఫ్కు అర్హత సాధించకపోవడంతో శనివారం తన ఆఖరి మ్యాచ్ను సన్రైజర్స్తో ఆడనుంది. ఈ మ్యాచ్కు బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదిక కానుంది.
The last game of the season is here and @imVkohli and @ABdeVilliers17 want you guys to know what’s on their minds. #PlayBold pic.twitter.com/GddTgzy2Zp
— Royal Challengers (@RCBTweets) May 4, 2019
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్స్ట్రైకర్ ఎండ్లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more