చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ క్రీజులో వుండగా, అందులోనూ అటాకింగ్ చేస్తున్న ఆయన చివరి బాల్ ను అంతఈజీగా వదిలేస్తాడని తాము అసలు ఊహించలేదని రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు వికెట్ కీపర్ పార్థివ్ పటేల్ అంటున్నాడు. చిన్నస్వామి స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్లో ధోనీ చివరి బాంతికి పరుగులు చేయకపోవడంతో చెన్నై ఒక్క పరుగు తేడాతో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు చేతిలో ఓటమికి గురైంది. ఈ గెలుపుపై స్పందించిన సార్థివ్ పటేల్ తాను చూసింది నిజమేనా.. నమ్మలేని నిజమిలా ఎదురైందని వ్యాఖ్యానించాడు.
చివరి ఓవర్.. గెలుపోటలములను నిర్ణయించనున్న చివరి బంతి.. స్టేడియంలో వున్నవారే కాదు.. ఏకంగా టీవీల ముందువున్న వారు కూడా ఒక్కసారిగా తమ కళ్లను తామే నమ్మలేకపోయారు. తీవ్ర ఉత్కంఠతో కూడిన ఈ మ్యాచ్ లో చివరి బంతికి రెండు పరుగులు సాధిస్తే బెంగుళూరుపై చెన్నై గెలువడం ఖాయం. క్రీజులో ఉన్నది ధోనీ.. అప్పటికే వీరబాధుడు బాదుతున్న మిస్టర్ కూల్.. మ్యాచ్ పినిష్ చేస్తారని అంతా బావించారు. కానీ కొంత ఉత్కంఠ మాత్రం అందరిలోనూ వుంది. కానీ ధోని చివరి బంతిని వదిలేయడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ధోని అంత ఈజీగా వదిలేస్తాడని పార్థివ్ పటేల్ ఊహించలేదట.
మిగిలింది ఒకే ఒక్క బాల్. జట్టు గెలవాలంటే రెండు పరుగులు కావాలి. ఈ పరిస్థితుల్లో ధోనీని ఆఫ్ సైడ్ హిట్ చేసేలా వ్యూహం పన్నాం. ఎందుకంటే లెగ్ సైడ్ కొడితే కచ్చితంగా 2పరుగులు చేసేస్తాడని అందరికీ తెలుసు. ఉమేశ్ యాదవ్ని నెమ్మెదిగా వేసి ఆఫ్ సైడ్ కొట్టేలా చేయాలని చెప్పామని పార్థివ్ పటేల్ చెప్పాడు. ఆఫ్ స్టంప్ కు వెలుపలగా వచ్చిన బంతిని ధోనీ అనూహ్యంగా వదిలేశాడు. అది ఎవరూ ఊహించి ఉండరు. ధోనీ ఆ బంతిని వదలడం ఆశ్చర్యానాకి గురి చేసింది. ముందునుంచి మహీకి డాట్ బాల్స్ వేయాలని ప్రయత్నించాం. అతని సంగతి తెలియని వారెవరుంటారు. ఒత్తిడికి గురి చేయాలని అనుకుంటే ఎదురుదాడి చేశాడు' అని మ్యాచ్ అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడిన పార్థివ్ పటేల్ వెల్లడించాడు.
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్స్ట్రైకర్ ఎండ్లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more