ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో ఈ సారి పేలవ ప్రదర్శనను కనబరుస్తున్న రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు క్రితం రోజు రాత్రి కూడా మ్యాచ్ ను చేజార్చుకుంది అని భావించినా.. చివరి బంతి ట్విస్ట్ నేపథ్యంలో మళ్లీ ప్లే ఆఫ్ వైపు పయనించేందుకు ఆశలు చిగురించాయి. అయితే ఇదే దూకుడు కనబరిస్తే తప్ప.. చివరి వరకు ప్రయత్నించాల్సిన అవసరం వుందని అభిమానులు కోరుతున్నారు. అయితే ఆ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ.. మాత్రం మ్యాచ్ చివరి ఓటర్ చేరుకునేవరకు టీమిండియా మాజీ కెప్టెన్ చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ బ్యాటింగ్ చూసి భయమేసిందని తెలిపాడు.
చిన్నస్వామి స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్లో చివరి ఓవర్లో భయంకరమైన ఇన్నింగ్స్ ఆడాడు. ఉమేశ్ యాదవ్ బౌలింగ్లో ఆ ఓవర్లో కావలసిన 26పరుగులు పూర్తి చేస్తాడేమోననిపించింది. 48 బంతుల్లో 84పరుగులు చేసిన ధోనీ.. ఒక్క పరుగు తేడాతో ఆర్సీబీ చేతిలో ఓడిపోవాల్సి వచ్చింది. 'స్పల్ప వ్యత్యాసంతో మ్యాచ్ గెలవడం చాలా సంతోషంగా ఉంది. చాలా అవకాశాలను వదిలేసుకున్నాం. మహీ మాత్రం తన అత్యుత్తమ ప్రదర్శన కనబరిచాడు. మేమంతా అతని బ్యాటింగ్కు భయపడిపోయాం. చివర్లో మాత్రం ఊహించిందే జరిగింది'
'లీగ్లో ముగిసిన తొమ్మిది మ్యాచులలో కొన్ని సార్లు బ్యాటింగ్, కొన్ని సార్లు బౌలింగ్ చేస్తున్నా.. గెలుస్తామన్న నమ్మకం తమలో తమకేలేక చేజార్చుకున్నామని విరాట్ కోహ్లీ చెప్పాడు. మ్యాచ్ చివరికి వచ్చే సరికి ఇక తమ ఓటమి తప్పదని నిర్ణయించుకోవడంతేనే పలు మ్యాచ్ లు ఓడిపోయామని అన్నారు. ఈ మ్యాచ్లోనూ ధోనీ అంతటి పనే చేశాడని అన్నారు. 19ఓవర్ల వరకూ బాగా ఆడి ప్రత్యర్థిపై ఒత్తిడి పెంచాలనుకుంటే మహీ ఎదురుదాడి మమ్మల్ని భయానికి గురిచేసింది.. అయితే చివరి బంతి పూర్తైయ్యేవరకు తమలోని నమ్మకాన్ని సన్నగిల్లవద్దని వారిని ఉత్తేజపరుస్తూనే వున్నానని, అదే నిజమై చివరి బంతి విజయాన్ని అందించిందని కోహ్లీ వివరించాడు.
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్స్ట్రైకర్ ఎండ్లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more