భారత యువ క్రికెటర్లు హార్దిక్ పాండ్య, కేఎల్ రాహుల్ కి చెరో రూ. 20 లక్షలు జరిమానా పడింది. మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు ఈ జరిమానా విధిస్తున్నట్లు బీసీసీఐ అంబుడ్స్ మెన్ డీకే జైన్ ప్రకటించారు. గత ఏడాది ‘కాఫీ విత్ కరణ్’ టాక్ షోకి హాజరైన ఈ ఇద్దరు క్రికెటర్లు నోరుజారి వివాదాల్లో చిక్కుకున్న విషయం తెలిసిందే. ఇంగ్లాండ్ వేదికగా మే 30 నుంచి వన్డే ప్రపంచకప్ మొదలుకానుండగా.. రిజర్వ్ ఓపెనర్ గా కేఎల్ రాహుల్, ఆల్ రౌండర్ గా హార్దిక్ పాండ్యాని జట్టులోకి ఎంపిక చేశారు భారత సెలక్టర్లు.
ఈ ఇద్దరు క్రికెటర్లు చెల్లించే రూ. 20 లక్షల జరిమానాలో.. రూ.10 లక్షల్ని పారా మిలిటరీ ఫోర్స్లో వీరమరణం పొందిన కానిస్టేబుల్స్ భార్యలకి, మిగిలిన రూ. 10 లక్షల్ని అంధుల క్రికెట్ అసోసియేషన్ కి విరాళంగా ఇవ్వాలని బీసీసీఐ అంబుడ్స్ మెన్ సూచించింది. ఈ మొత్తాన్ని నాలుగు వారాలలోపు ఇద్దరు క్రికెటర్లు చెల్లించాలని కూడా అతను ఆదేశించాడు. మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు ఇప్పటికే గత జనవరిలో రాహుల్, హార్దిక్ పాండ్యాపై కొద్దిరోజులు నిషేధం విధించిన నేపథ్యంలో.. వారిపై ఇక ఎలాంటి చర్యలు ఉండబోవని బీసీసీఐ అంబుడ్స్మెన్ స్పష్టం చేశారు.
అసలు ఏం జరిగిందంటే..? బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహార్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ‘కాఫీ విత్ కరణ్’ టాక్ షోకి గత ఏడాది ఆఖర్లో హాజరైన హార్దిక్ పాండ్య, కేఎల్ రాహుల్.. అక్కడ జోహార్ సరదాగా అడిగిన ప్రశ్నలకి కొంటెగా సమాధానం చెప్పి చిక్కుల్లో పడ్డారు. తాను ఎంత మందితో శృంగారంలో పాల్గొన్నది, పార్టీల్లో అమ్మాయిల్ని చూసే విధానంపైనా హార్దిక్ పాండ్య అనుచిత వ్యాఖ్యలు చేయగా.. కేఎల్ రాహుల్.. తన జేబులో కండోమ్ ప్యాకెట్ ఉండటం, అది తన తండ్రి చూసి ఫర్వాలేదు రక్షణ కవచం వాడుతున్నావంటూ ప్రశంసించినట్లు చెప్పడంపై అప్పట్లో పెద్ద ఎత్తున విమర్శలు చెలరేగాయి.
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్స్ట్రైకర్ ఎండ్లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more