ఐపీఎల్ లో భాగంగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో క్రితం రోజు రాత్రి జరిగిన మ్యాచ్ లో కోల్కతా నైట్ రైడర్స్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ ఏడ్చేశాడు. ఈ మ్యాచ్ లో ఆర్సీబీ కెప్టెన్ విరాట్ కోహ్లీ, ఇంగ్లాండ్ కు చెందిన ఆల్ రౌండర్ మొయీన్ అలీలు బెంగళూర్ జట్టు తరపున అడుతూ చెలరేగిపోయారు. ఫోర్లు, సిక్సర్లతో విరుచుకుపడ్డారు. బంతిపై బ్యాట్తో విచక్షణ రహితంగా దాడి చేశారు. వీరిద్దరి దెబ్బకు బెంగళూరు స్కోరుబోర్డు పరుగులు పెట్టింది. ఆ తర్వాత లక్ష్య ఛేదనలో కోల్కతా చతికిలపడడంతో బెంగళూరు రెండో విజయాన్ని నమోదు చేసింది.
చైనామన్ బౌలర్ కుల్దీప్ యాదవ్ వేసిన 16వ ఓవర్లో మొయీన్ అలీ శివాలెత్తిపోయాడు. గతంలో ఎన్నడూ ఆడని ఆటతీరుతో చెలరేగిపోయాడు. తొలి బంతిని ఫోర్ కొట్టిన అలీ రెండో బంతిని సిక్సర్గా మలిచాడు. మూడు, నాలుగు బంతులను ఫోర్, సిక్సర్ కొట్టాడు. ఐదో బంతి వైడ్ కాగా, ఆ తర్వాతి బంతికి మరో సిక్సర్ బాదాడు. దీంతో ఐదు బంతుల్లోనే 27 పరుగులు లభించాయి. అయితే, చివరి బంతిని కూడా స్టాండ్స్లోకి తరలించే క్రమంలో ప్రసీద్కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు.
తన బౌలింగ్ను ఉతికి ఆరేసిన అలీని చూసి కుల్దీప్ నిశ్చేష్టుడయ్యాడు. చివరి బంతికి అలీ అవుటయ్యాక కుల్దీప్ కోపంతో తన క్యాప్ను విసిరికొట్టాడు. ఆ తర్వాత ఉద్వేగాన్ని ఆపుకోలేక ఏడ్చేశాడు. కాగా, 24 ఏళ్ల కుల్దీప్ తన చెత్తబౌలింగ్తో ఐపీఎల్తో ఓ చెత్త రికార్డును తన పేరున రాసుకున్నాడు. ఈ మ్యాచ్లో మొత్తం 4 ఓవర్లు వేసిన కుల్దీప్ 59 పరుగులిచ్చి ఓ వికెట్ నేలకూల్చాడు. ఐపీఎల్లో అత్యధిక పరుగులు సమర్పించుకున్న స్పిన్నర్గా కుల్దీప్ పేరు రికార్డులకెక్కింది.
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్స్ట్రైకర్ ఎండ్లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more