తొలి టీ20లో అత్యధిక పరుగుల తేడాతో పరాజయం పాలైన రోహిత్ సేన తాజాగా ఇవాళ జరిగిన రెండో టీ20లో కివీస్ పై ప్రతీకారం తీర్చుకుంది. న్యూజిలాండ్ పై 7 వికెట్ల తేడాతో టీమిండియా ఘన విజయం సొంతం చేసుకుంది. ఆక్లాండ్ వేదికగా జరిగిన మ్యాచులో 159 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన టీమిండియా ఇంకా ఏడు బంతులు మిగిలి ఉంగానే లక్ష్యాన్ని చేరుకుంది. టీమ్ విజయంలో రోహిత్, కృనాల్ కీలకపాత్ర పోషించారు.
లక్ష్య ఛేదనలో భారత్ మూడు వికెట్లు కోల్పోయింది. రోహిత్(50), శిఖర్(30), విజయ్ శంకర్(14) వికెట్లు కోల్పోయినా.. రిషబ్ పంత్(40 నాటౌట్), ధోనీ(20 నాటౌట్) మ్యాచ్ను విజయ తీరాలకు చేర్చారు. దీంతో సిరీస్ 1-1తో సమమయ్యింది. ఇక సిరీస్ ను తేల్చే మూడవది.. ఆఖరు టీ20ని గెలుచుకునేందుకు ఇరు జట్టు సిద్దంకానున్నాయి. కివీస్ బౌలర్లలో ఫెర్గ్యూసన్, సోధి, మిచెల్ చెరో వికెట్ తీసుకున్నారు.
అంతకు ముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 158 పరుగులు చేసింది. తొలి టీ-20 మ్యాచులో భారత బౌలింగ్ ను ఊచకోత కోసిన ప్రమాదకర బ్యాట్స్మెన్ సీఫెర్ట్ (12) ఆరంభంలోనే భువనేశ్వర్ కుమార్ బౌలింగ్లో కీపర్ ధోనీకి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. దీంతో పదిహేను పరుగుల వద్ద కివీస్ తొలి వికెట్ కోల్పోయింది. అనంతరం కృనాల్ పాండ్యా కివీస్ ను కష్టాల్లోకి నెట్టేశాడు.
ఓపెనర్ మున్రో (12), మిచెల్ (1), కెప్టెన్ కేన్ విలియమ్సన్ (20) కృనాల్ ధాటికి క్రీజులో ఎక్కువసేపు నిలవలేకపోయారు. ఈ దశలో గ్రాండ్హోమ్ (50), రాస్ టేలర్ (42) కివీస్ను ఆదుకున్నారు. ఐదో వికెట్కు 77 పరుగులు జోడించారు. వేగంగా ఆడుతూ స్కోరు బోర్డును ఉరకలెత్తిస్తున్న ఈ జోడీని హార్దిక్ పాండ్యా విడదీశాడు. పాండ్యా బౌలింగ్లో రోహత్కు క్యాచ్ ఇచ్చి గ్రాండ్హోమ్ వెనుదిరిగాడు. కొద్దిసేపటికే టేలర్ రనౌట్ అయ్యాడు. అనంతరం వచ్చిన బ్యాట్స్మన్ పెద్దగా పరుగులు చేయలేకపోవడంతో న్యూజిలాండ్ 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 158 పరుగులు చేసింది. భారత బౌలర్లలో కృనాల్కు 3, ఖలీల్కు 2 వికెట్లు దక్కాయి. భువనేశ్వర్కుమార్, హార్దిక్ పాండ్యా చెరో వికెట్ పడగొట్టారు.
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్స్ట్రైకర్ ఎండ్లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more