నాలుగు టెస్ట్ సిరీస్ లో భాగంగా మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్స్ వేదికగా ఆస్ట్రేలియాతో ఇవాళ ప్రారంభమైన మూడవ, బాక్సింగ్ డే టెస్ట్ లో చతేశ్వర్ పుజారా నిలకడగా ఆడాడు. తనదైన శైలీ ఆటతో వికెట్ కాపాడుకుంటూ అర్థ శతకాన్ని నమోదు చేశాడు. ఈ క్రమంలో ఓ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ సిరీస్లో తొలి టెస్ట్ మ్యాచ్.. తొలి ఇన్నింగ్స్లో 246 బంతుల్లో 123 పరుగులు, అదే మ్యాచ్ రెండో ఇన్నింగ్స్లో 204 బంతుల్లో 71 పరుగులు చేశాడు.
ఇక రెండో టెస్ట్ మ్యాచులో మాత్రం పుజారా తన బ్యాటుతో అకట్టుకోవడంలో విఫలమయ్యాడు. అయితే ప్రస్తుతం మెల్ బోర్న్ వేదికగా జరుగుతున్న బాక్సింగ్ డే టెస్టులో మాత్రం పుజారా మరోసారి తన బ్యాట్కి పని చెప్పాడు. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్ తొలి రోజు మ్యాచ్ ముగిసే సమయానికి 200 బంతుల్లో 68 పరుగులు చేశాడు. దీంతో ఈ సిరీస్ లో మూడు ఇన్నింగ్స్ లో 200 బంతులకు పైగా ఎదుర్కోన్న క్రికెటర్ గా నిలిచాడు.
ఈ క్రమంలో పుజారా తన ఖాతాలో అరుదైన ఘనతను వేసుకున్నాడు. ఒక సిరీస్ లో మూడు సార్లు 200లకు పైగా బంతులు ఆడిన భారత క్రికెటర్ల జాబితాలో పుజారా చేరాడు. ఈ జాబితాలో మొదటి స్థానంలో టీం ఇండియా క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ ఉన్నారు. 1977/78 మధ్య జరిగిన ఓ టెస్ట్ సిరీస్లో గవాస్కర్ ఈ ఫీట్ సాధించారు. గవాస్కర్ తర్వాతి స్థానంలో పుజారా నిలిచాడు. ఈ సందర్భంగా పుజారాపై ప్రశంసల వర్షం కురుస్తోంది.
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్స్ట్రైకర్ ఎండ్లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more