ఆస్ట్రేలియా పర్యటనకి భారత్ వెళ్తున్న సందర్భంగా ఆ దేశ క్రికెటర్లకి దక్షిణాఫ్రికా కెప్టెన్ డుప్లెసిస్ ఓ సలహా ఇచ్చాడు. ఈనెల 21 నుంచి భారత్ జట్టు ఆ గడ్డపై మూడు టీ20లు, నాలుగు టెస్టులు, మూడు వన్డేల సుదీర్ఘ సిరీస్ను ఆడనుండగా.. కెప్టెన్ విరాట్ కోహ్లీని మాత్రం సిరీస్లో రెచ్చగొట్టే ప్రయత్నం చేయద్దని ఆసీస్కి డుప్లెసిస్ సూచించాడు. ఈ ఏడాది ఆరంభంలో దక్షిణాఫ్రికా పర్యటనకి భారత్ జట్టు వెళ్లగా.. కోహ్లీ తాను ఆడిన మూడు టెస్టుల్లో ఏకంగా 286 పరుగులతో సత్తాచాటాడు.
అయితే.. అవి చాలా తక్కువని.. తమ క్రికెటర్లు సిరీస్లో సైలెంట్గా ఉండటంతోనే.. కోహ్లీని ఆ మాత్రమైనా కట్టడిచేయగలిగామని డుప్లెసిస్ చెప్పుకొచ్చాడు. ‘అంతర్జాతీయ క్రికెట్లో ప్రత్యర్థి కవ్వింపులను సవాల్గా తీసుకుని ఆడే క్రికెటర్లు తక్కువగా ఉన్నారు. భారత్ కెప్టెన్ విరాట్ కోహ్లీ ఈ జాబితాలోకి వస్తాడు. అతను ప్రత్యర్థితో ఢీకొట్టడాన్ని బాగా ఆస్వాదిస్తాడు.
అందుకే.. సిరీస్ ఆరంభానికి ముందే మేము అతడ్ని రెచ్చగొట్టకూడదని జట్టు సమావేశంలో నిర్ణయించుకున్నాం. ఈ మేరకు సిరీస్ సాంతం అతడికి ‘సైలెంట్ ట్రీట్మెంట్’ ఇచ్చాం. అయినప్పటికీ.. కోహ్లీ పరుగులు సాధించాడు. కానీ.. అతని జోరుతో పోలిస్తే.. అవి ఏమీ అంత ఎక్కువ కాదని మా అభిప్రాయం. సెంచూరియన్ పిచ్ నెమ్మదిగా ఉన్నా.. అతను శతకం బాదడం మమ్మల్ని ఆశ్చర్యపరిచింది. దక్షిణాఫ్రికాకి సైలెంట్ ట్రీట్మెంట్ మంచి ఫలితాన్నిచ్చింది.. మరి ఆస్ట్రేలియాకి కూడా అది ఉపయోగపడుతుందేమో..? చూడాలి’ అని డుప్లెసిస్ వెల్లడించాడు.
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్స్ట్రైకర్ ఎండ్లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more