రాజ్ కోట్ వేదికగా వెస్టిండీస్ తో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా విజయం దిశగా పట్టు బిగించింది. అరంగ్రేట మ్యాచ్ లోనే పృధ్వీ షా తన తొలి సెంచరీని నమోదు చేయడంతో.. విరాట్ కోహ్లీ కూడా తన 24వ శతకాన్ని నమోదు చేయడం.. దీంతో పాటు అటు అల్ రౌండర్ రవీంద్ర జడేజా కూడా టెస్టు్లో తన తొలి సంచరీని అందుకోవడంతో భారత్ పటిష్ట స్థితిలో నిలిచింది. దీంతో భారత్ 9 వికెట్లకు 649 పరుగులు చేరిన క్రమంలో తొలి ఇన్నింగ్స్ ను టీమిండియా డిక్లేర్ చేసింది.
భారత ఇన్నింగ్స్ లో పృథ్వీ షా (134), కోహ్లీ (139), జడేజా (100)లు సెంచరీలు సాధించారు. మిడిల్ ఆర్డర్ లో జడేజా సత్తా చాటి 132 బంతుల్లో 100 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. కొద్దిలో వికెట్ కీపర్ రిషబ్ పంత్.. వంద పరుగుల మైలురాయిని అందుకోలేకపోయాడు. ఇతర బ్యాట్స్ మెన్లలో పుజారా 86, రహానే 41, పంత్ 92, అశ్విన్ 7, కుల్దీప్ యాదవ్ 12, ఉమేష్ యాదవ్ 22 పరుగులు చేశారు. మొహమ్మద్ షమీ 2 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు.
విండీస్ బౌలర్లలో బిషూ 4 వికెట్లు, లూయిస్ 2 వికెట్లు పడగొట్టగా... గాబ్రియెల్, ఛేస్, బ్రాత్ వైట్ లు చెరో వికెట్ తీశారు. పుజారా-షాల మధ్య 206 పరుగులు, కోహ్లీ-రహానేల మధ్య 105 పరుగులు, కోహ్లీ-పంత్ ల మధ్య 133 పరుగుల భాగస్వామ్యాలు నమోదయ్యాయి. వెస్టిండీస్ తొలి ఇన్నింగ్స్ ప్రారంభమైంది. బ్రాత్ వైట్, పావెల్ ను ఇన్నింగ్స్ ను ప్రారంభించారు. దీంతో అటు బౌలింగ్ లో కూడా భారత్ తన సత్తాను చాటింది. తొలి రోజు అటముగిసే సమయానికి విజయం వైపు సాగుతుంది.
రెండో రోజు అటముగిసే సమయానికి విండీస్ పతనాన్ని శాసించిన భారత బౌలర్లు ఆరు వికెట్లను తమ ఖాతాలో వేసుకున్నారు. మరో మూడు రోజుల వ్యవధి వున్నా.. రెండు మూడు రోజుల్లోనే.. మ్యాచ్ ను తన ఖాతాలో వేసుకునేందుకు కోహ్లీ సేన రెడీ అవుతుంది. ఇన్నింగ్ ప్రారంభంలోనే షమీ ఓపనెర్లు బ్రెత్ వైట్, పావెల్ వికెట్లను తీశాడు. ఆ తరువాత అశ్విన్ హోప్ వికెట్ ను గిరాటేశాడు. అనంతరం హెట్మయర్ ను జడేజా రనౌట్ గా వెనక్కు పంపగా, ఆ తరువాత అంబ్రియాను వికెట్ ను జడేజా కూలదోసాడు. ఇక డౌవ్ రిచ్ వికెట్ ను కుల్దీప్ యాదవ్ తన ఖాతాలో వేసుకున్నాడు.
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్స్ట్రైకర్ ఎండ్లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more