ఇంగ్లాండ్ పర్యటనలో ఉన్న భారత-ఎ జట్టు అద్బుతంగా రాణించడానికి కోచ్ రాహుల్ ద్రావిడ్ కారణమని జట్టు ఓపెనర్ పృథ్వీ షా వెల్లడించాడు. ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు ఎలెవన్తో తాజాగా జరిగిన ప్రాక్టీస్ మ్యాచులో భారత-ఎ జట్టు 125 పరుగుల భారీ తేడాతో గెలుపొందడానికి కారణం తమకు స్వేచ్చనివ్వడమే కారణమని అన్నారు. తమను సోంత గేమ్ అడమని రాహుల్ ప్రోత్సహించడం వల్లే ప్రాక్టీసు మ్యాచులో తాము ఘనవిజయాన్ని అందుకున్నామని షా తెలిపారు.
ఈ గేమ్లో తాను (70: 61 బంతుల్లో 7x4, 3x6) అర్ధ శతకంతో జట్టుకి శుభారంభమివ్వగా.. కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ (54: 45 బంతుల్లో 5x4, 1x6), ఇషాన్ కిషన్ (50: 46 బంతుల్లో 4x4, 2x6) రాణించడంతో తొలుత బ్యాటింగ్ చేసిన తమ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 328 పరుగుల భారీ స్కోరు సాధించిందని అన్నాడు. అనంతరం ఛేదనకు దిగిన ఇంగ్లాండ్ జట్టు దీపక్ చాహర్ (3/48), అక్షర్ పటేల్ (2/21) ధాటికి 203 పరుగులకే కుప్పకూలిపోయింది.
‘మ్యాచ్ల్లో అనుసరించాల్సిన టెక్నికల్ వ్యూహాల గురించి రాహుల్ ద్రవిడ్ సర్ జట్టుతో ఎక్కువగా చర్చించలేదు. కానీ.. మైదానంలో మానసిక దృఢంతో ఎలా ఉండాలో మాత్రం చెప్పారు. రాహుల్ సార్, పాంటింగ్ ఇద్దరూ అంతే.. జట్టులో ప్రతికూల ఆలోచనలు లేకుండా చూస్తారు. ఇంగ్లాండ్ పర్యటన గురించి రాహుల్ ద్రవిడ్ సార్ ఒక్కటే చెప్పారు.. మీ సహజమైన ఆటను ఆడండని. ఇక్కడ పరిస్థితుల్ని అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం.. మెరుగైన ప్రదర్శనని కొనసాగించాలంటే జాగ్రత్తగా ఆడాల్సిందే’ అని పృథ్వీ షా వెల్లడించాడు.
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్స్ట్రైకర్ ఎండ్లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more