బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా.. టీమిండియాతో చారిత్రక తొలి టెస్టు ఆడబోతున్న అఫ్గానిస్థాన్ జట్టుపై తాము అత్యుత్తమంగా రాణించేందుకు జట్టుసభ్యులంతా సిద్దంగా వున్నారని భారత జట్టు తాత్కాలిక కెప్టెన్ అజింక్య రహానె స్పష్టం చేశాడు. ఇటీవల టెస్టు హోదా దక్కించుకున్న అఫ్గానిస్థాన్ జట్టు టీమిండియాతో ఏకైక టెస్టు మ్యాచును ఆడనుంది. జూన్ 14న ప్రారంభం కానున్న ఈ టెస్టు లో తాము ప్రత్యర్థి జట్టును తేలిగ్గా తీసుకోవడం లేదని రహానె తెలిపాడు.
అఫ్గానిస్థాన్ జట్టు అటగాళ్లను గౌరవిస్తూనే.. నిర్ధాక్షిణ్యంగా ఆ జట్టుపై విరుచుకుపడతామని వివరించాడు. ఈ సందర్భంగా ఆయన బెంగుళూరులో మీడియాతో మాట్లాడుతూ.. తొలి టెస్టు అడుతున్నంత మాత్రాన వారిని తక్కువగా అంచనా వేయలేమని అన్నారు. అయితే వారి జట్టులో మెరుగైన స్పిన్నర్లు వున్నట్లుగానే తమ జట్టులో కూడా మంచి స్పిన్నర్లు వున్నారని చెప్పారు. వాళ్లది నాణ్యమైన జట్టు అని కితాబిచ్చారు. అయితే తమ జట్టులో కూడా అదిరిపోయే అటగాళ్లు వున్నారని చెప్పారు.
‘అఫ్గానిస్థాన్ జట్టుని మేము ఏమీ తేలిగ్గా తీసుకోవడం లేదు. వాళ్లది నాణ్యమైన జట్టు.. స్పిన్నర్లు కూడా మెరుగ్గా రాణిస్తున్నారు. ఒక టెస్టు జట్టుగా ప్రత్యర్థిని గౌరవిస్తూనే.. నిర్ణాక్షిణ్యంగా ఆడేందుకు ప్రయత్నిస్తాం. ప్రతి ఒక్కరూ తాము ఆడుతున్న జట్టే మెరుగ్గా ఉందని అనుకుంటుంటారు. కానీ.. గణాంకాలు అందరికీ తెలుసు. అశ్విన్, జడేజా, కుల్దీప్ యాదవ్ అనుభవం స్పిన్నర్లు. ఒక జట్టుగా మేము గణాంకాల్ని పట్టించుకోకుండా.. అత్యుత్తమంగా ఆడేందుకు ప్రయత్నిస్తాం’ అని రహానె వెల్లడించాడు.
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్స్ట్రైకర్ ఎండ్లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more