ఐపీఎల్ కు రెండేళ్ల పాటు దూరమైన క్రమంలో అభిమానుల్లో ఏదో తెలియని లోటు మాత్రం వెంటాడింది. అదే చెన్నై లేని లోటు. ఈ రెండేళ్లు చెన్నై అటగాళ్లు వేర్వేరు జట్ల తరపున అడినా.. ఆ ఆటలు మాత్రం అంతగా ప్రేక్షకాధరణ పొందలేదు. రెండేళ్ల తరువాత మళ్లీ పుంజుకుని బరిలోకి దిగిన చెన్నై జట్టుకు ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా అదే తరహాలో పుంజుకున్న విషయం తెలిసిందే. దేశంలోని ఏ ప్రాంతానికి వెళ్లినా చెన్నై సూపర్ కింగ్స్ కు అభిమానులు వెల్లువెత్తుతున్నారంటే ఆ జట్టుపై వున్న ఎక్స్ పెక్ట్ టేషన్స్ ఎంతో మనకు ఇట్టే అర్థమౌవుతంది.
ఇక చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు ఇంతటి పాపులారిటీ, ఫ్యాన్ ఫాలోయింగ్ వుండటానికి కారణం ఎవరో కూడా అందరికీ తెలిసిందే. అది మరెవరో కాదు జట్టు కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని. కావేరి జల వివాదం కారణంగా చెన్నై సూపర్ కింగ్స్ సొంతగడ్డపై ఆడే మ్యాచ్ లన్ని పుణెకు తరలిన సంగతి తెలిసిందే. వేదిక మారినా ధోనీ సేనకు ఏమాత్రం మద్దతు తగ్గలేదు. ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా తగ్గలేదు. ఈ క్రమంలో సోమవారం రాత్రి టోర్నీలో భాగంగా సోమవారం చెన్నై సూపర్ కింగ్స్ - దిల్లీ డేర్డెవిల్స్ మధ్య పుణె వేదికగా మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే.
ఈ మ్యాచ్ కోసం ఆటగాళ్లు ప్రత్యేక బస్సులో మైదానానికి వస్తున్న క్రమంలో ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియోను సీఎస్కే ప్రధాన కోచ్ స్టీపెన్ ఫ్లెమింగ్ తన ట్విటర్ ద్వారా పంచుకున్నాడు. ఇప్పుడు ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. ఓ అభిమాని ధోనీ కటౌట్ను పట్టుకుని చెన్నై జట్టు ప్రయాణిస్తున్న బస్సుతో పాటు కదులుతూ కనిపించాడు. బస్సులో ఉన్న ధోనీని చూసేందుకు చాలా ప్రయత్నించాడు. కానీ, పాపం అతనికి ధోనీ కనిపించలేదు. ఎందుకంటే ధోనీ ఆ బస్సులో లేడు. ఈ విషయాన్ని ఫ్లెమింగ్ తెలిపాడు.
Concern that Dhoni hasn’t made the bus!! pic.twitter.com/dPP5NznCIU
— Stephen Fleming (@SPFleming7) April 30, 2018
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్స్ట్రైకర్ ఎండ్లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more