టీమిండియా మాజీ కెప్టెన్ ధోనీ ఖాతాలో మరో అరుదైన రికార్డు సాధించాడు. ఐపీఎల్ లో భాగంగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచులో 34 బంతుల్లో ఒక ఫోర్, 7 సిక్సర్లు బాదిన ధోనీ 70 పరుగులు సాధించాడు. ఫలితంగా అతడి ఖాతాలోకి 5వేల పరుగులు వచ్చి చేరాయి. టీ20ల్లో 5వేల పరుగులు సాధించిన భారత తొలి కెప్టెన్గా ధోనీ రికార్డు సృష్టించాడు. 36 ఏళ్ల ధోనీ టీ20ల్లో మొత్తం 5,786 పరుగులు సాధించగా, అందులో 5,010 పరుగులు టీ20 కెప్టెన్గా చేసినవి కావడం గమనార్హం.
అయితే అది టీమిండియా టీ20 జట్టు కెప్టెన్ గా చేసినవా లేక చెన్నై సూపర్ కింగ్స్ జట్టు కెప్టెన్ గా చేసినవా అన్న తేడా మాత్రం లేదు. ఇక కెప్టెన్ గా అత్యధిక పరుగులు సాధించిన జాబితాలో ధోని తరువాత గౌతమ్ గంభీర్ 4242 పరుగులతో రెండో స్థానంలో వుండగా, విరాట్ కోహ్లీ 3591 పరుగులతో తృతీయ స్థానంలో కొనసాగుతున్నాడు. వీటితో పాటు నిన్నటి మ్యాచులో మరిన్నీ అరుదైన రికార్డులు కూడా నమోదయ్యాయి.
2012లో ఆర్సీబీతో జరిగిన మ్యాచ్లోనూ చెన్నై జట్టు 206 పరుగుల విజయ లక్ష్యాన్ని ఛేదించింది. ఒక సీజన్లో 200 పరుగులకు పైగా విజయ లక్ష్యాన్ని ఛేదించిన రెండో జట్టుగా సీఎస్కే రికార్డులకెక్కింది. కోల్కతాతో జరిగిన మ్యాచ్లో 203 పరుగులను సాధించిన ధోనీ జట్టు తాజాగా 206 పరుగుల లక్ష్యాన్ని అందుకుంది. గతంలో డెక్కన్ చార్జర్స్ ఈ ఘనత సాధించింది. నిన్నటి మ్యాచ్లో రాయుడు-ధోనీ కలిసి 59 బంతుల్లో 101 పరుగులు సాధించారు. ఐదో వికెట్కు చెన్నై సెంచరీ భాగస్వామ్యం సాధించడం ఇదే తొలిసారి.
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్స్ట్రైకర్ ఎండ్లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more