ఐపీఎల్ స్టార్ బ్యాట్స్ మెన్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు ఈ ఐపీఎల్ సీజన్ అస్సలు కలసిరావడం లేదు. మరీ ముఖ్యంగా జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీకి ఎంత శ్రమించినా ఫలితం మాత్రం దక్కడం లేదు. అతని జట్టు గెలవాల్సిన మ్యాచులు కూడా ఓడిపోతున్నాడు. రెండు వందల పరుగుల పైచిలుకు పరుగులు చేసినా ఓటమి చవిచూడాల్సి రావడం దురదృష్టకరమే. నిన్న చెన్నై సూపర్ కింగ్స్ తో జరిగిన మ్యాచులో విజయం రాయల్స్ వైపునే వుందని అందరూ అంచనాలు వేసినా.. రాయుడు, ధోనీల వీరవిహారంతో మ్యాచ్ గతి తిరిగింది.
క్రితం రోజు చెన్నైతో జరిగిన మ్యాచులో ముందుగా బ్యాటింగ్ చేసిన బెంగళూరు రాయల్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 205 పరుగులు సాధించి చెన్నై సూపర్ కింగ్స్ ఎధుట 206 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. ఓ దశలో చైన్నై జట్టు 74 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఆ దశలో ధోనీ, రాయుడు పరుగుల సునామీని సృష్టించారు. అటు ధోని, ఇటు రాయుడు ఇద్దరూ అర్థశతకాలను సాధించి.. సిక్సర్లు, ఫోర్లతో చెలరేగి ఆడారు. దీంతో బెంగళూరుపై చెన్నై మరో రెండు బంతులు మిగిలివుండగానే విజయాన్ని అందుకుంది.
దీంతో ఎంత భారీ స్కోరు సాధించినా కాపాడుకోలేకపోయామని విరాట్ కోహ్లీ బెంగళూరు బౌలర్లపై విరుచుకుపడ్డారు. ఇక మరోవైపు ఈ మ్యాచ్లో స్లో ఓవర్ రేట్ కారణంగా కోహ్లీపై భారీ జరిమానా పడింది. `స్లోఓవర్రేట్ కారణంగా ఆర్సీబీ జట్టు కెప్టెన్ కోహ్లీకి 12 లక్షల రూపాయల జరిమానా విధిస్తున్నాం. ఇలా చేయడం ఈ జట్టుకు ఇదే తొలిసారి` అని ఐపీఎల్ మేనేజ్మెంట్ ఓ లేఖ విడుదల చేసింది. కాగా, ఈ ఐపీఎల్లో ఇప్పటివరకు ఆరు మ్యాచ్లు ఆడిన బెంగళూరు జట్టు కేవలం రెండు మ్యాచ్ల్లో మాత్రమే విజయం సాధించి పాయింట్ల పట్టికలో ఆరోస్థానంలో నిలిచింది.
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్స్ట్రైకర్ ఎండ్లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more