2019 వరల్డ్ కప్ కు సంబంధించి షెడ్యూల్ లో స్వల్ప మార్పులు జరిగాయి. అయితే మార్పులు నేపథ్యంలో టీమిండియా, సౌతాఫ్రికాల మధ్య జరగాల్సిన మ్యాచ్ లు జూన్ 2కు బదులు జూన్ 5న జరగనుంది. ఇండియా తమ ఫస్ట్ మ్యాచ్ లో సౌతాఫ్రికాతో జూన్ 2న తలపడాల్సి వుంది. అయితే జస్టిస్ లోధా కమిటీ సిఫారసుల మేరకు ఈ సవరణలు చేశారు. ఈ సిఫార్సుల ప్రకారం ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ కు, అంతర్జాతీయ మ్యాచ్ కు మధ్య కనీసం 15 రోజుల సమయం కచ్చితంగా ఉండాలని స్పష్టంగా వుంది. దీంతో అంతర్జాతీయ క్రికెట్ కమిటీ సీఈవోల మీటింగ్లో దీనిపై చర్చించి సవరణలు చేశారు.
2019 వరల్డ్ కప్ మే 30 నుంచి జులై 14 వరకు ఇంగ్లండ్ లో జరగనున్న విషయం పాఠకులకు తెలిసింది. వరల్డ్ కప్ నేపథ్యంలో రానున్న ఏడాది ఐపీఎల్ సీజన్ 12 మ్యాచులు కూడా మార్చి నుంచే ప్రారంభించనున్నారు. మార్చి 29 నుంచి మే 19 వరకు జరగనుంది. దీంతో 15 రోజుల నిబంధన మేరకు జూన్ 5నే ఫస్ట్ మ్యాచ్ ఆడే వీలుంది బిసిసిఐ అధికారి చెప్పారు. సౌతాఫ్రికాతో ఇండియా ఫస్ట్ మ్యాచ్ ఉంటుంది. షెడ్యూల్ లో మార్పుకు CEC అంగీకరించింది. దీనిని ఐసిసి బోర్డుకు సిఫారసు చేశామని అధికారి వెల్లడించారు.
నిజానికి గతంలో ఇండియా, పాకిస్థాన్ తోనే పెద్ద పెద్ద ఈవెంట్ లను ఐసీసీ ప్రారంభించేది. 2015 వరల్డ్ కప్, 2017 చాంపియన్స్ ట్రోఫీ ఇలాగే ప్రారంభమైంది. అయితే ఈసారి మాత్రం ఇండో-పాక్ మ్యాచ్ ఉండటం లేదు. ఈసారి టోర్నీ రౌండ్ రాబిన్ పద్ధతిలో జరగనుంది అని ఆ అధికారి చెప్పారు. రౌండ్ రాబిన్ అంటే 1992 వరల్డ్ కప్ లో మాదిరిగా ఒక టీమ్ మిగతా అన్ని టీమ్స్ తో ఆడాల్సి ఉంటుంది. 2019-23 మధ్య ఐదేళ్ల కాలానికి ఎఫ్ టీ పీ ని కూడా ఈ సమావేశంలో నిర్ణయించారు. ఈ కాలంలో టీమిండియా మొత్తం 309 రోజుల పాటు అంతర్జాతీయ క్రికెట్ ఆడనుంది. అయితే టెస్ట్ మ్యాచ్ ల సంఖ్య 15 నుంచి 19కి పెరిగింది. ఇవన్నీ టెస్ట్ చాంపియన్ షిప్ లో భాగంగా జరిగేవే. డేనైట్ టెస్ట్ మ్యాచ్ మాత్రం ఇండియా ఇప్పట్లో ఆడబోవడం లేదు. టెస్ట్ చాంపియన్ షిప్ లో అన్ని మ్యాచ్ లూ డే మ్యాచ్లే.
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్స్ట్రైకర్ ఎండ్లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more