సఫారీ గడ్డపై ఇప్పటి వరకు సాధించని అరుదైన రికార్డును నెలకొల్పే దిశగా విరాట్ సేన ఉవ్విళ్లూరుతుంది. మూడో వన్డే గెలిచిన తరువాత మరో మ్యాచ్ గెలిస్తే కానీ అరు వన్డేల సిరీస్ ను టీమిండియా కైవసం చేయాలన్న లక్ష్యంతో పాటు ఐసీసీ నెంబర్ వన్ ర్యాంకింగ్ పై కన్నేసిన విరాట్ సేన.. ఆ దిశగా ప్రయత్నాలు చేస్తుంది. అయితే రానున్న వన్డేతో చరిత్ర ఎలా తిరగరాస్తారనేగా మీ డౌట్. వరుసగా రెండు వన్డేల్లో విజయ దుందుభి మోగించిన కోహ్లీసేన మూడో మ్యాచ్ పై కన్నేసింది. కీలక పోరులో గెలిచి చరిత్ర సృష్టించాలని ఉవ్విళ్లూరుతోంది.
దక్షిణాఫ్రికాలో ఇప్పటి వరకు భారత్ ఒక్క ద్వైపాక్షిక సిరీస్లోనూ రెండు మ్యాచ్లు మించి గెలిచింది లేదు. ఇప్పుడు ఆ సదవకాశం టీమిండియా ముందు నిలిచింది. ఆతిథ్య జట్టులో అనుభవజ్ఞులు గాయాలపాలై దూరమైన వేళ కోహ్లీసేనకు ఈ విజయం నల్లేరుపై నడకగా మారింది. ప్రస్తుతం జరుగుతున్న ఆరు వన్డేల సిరీస్లో భారత్ తన సత్తా ఏంటో చూపించింది. మణికట్టు స్పిన్ ద్వయం చెలరేగడంతో డర్బన్లో 6, సెంచూరియన్లో 9 వికెట్ల తేడాతో ఘన విజయాలు సాధించింది. ఇప్పుడు జరుగుతున్న కేప్టౌన్లోనూ గెలిచి తీరాలని పర్యాటక జట్టు కసితో ఉంది. సిరీస్ గెలిచి టెస్టు సిరీస్ ఓటమికి ప్రతీకారం తీర్చుకోవాలని పట్టుదలతో ఉంది.
మరోవైపు కోహ్లీసేన ఒత్తిడి లేకుండా ప్రశాంతంగా ఉంది. మూడో మ్యాచ్ గెలిచి సిరీస్ విజయానికి మరింత దగ్గరవ్వాలని పట్టుదలతో ఉంది. రోహిత్ను మినహాయిస్తే ధావన్, కోహ్లీ, రహానె ఫామ్ కనబరిచారు. మిడిలార్డర్లో ధోనీ, కేదార్ జాదవ్ ఉండనే ఉన్నారు. ఇక పేసర్లకు తోడు మణికట్టు స్పిన్ ద్వయం వికెట్లును తీస్తూ మ్యాచ్లను నిలబెడుతోంది. జట్టు ఎంపిక పరంగానూ కోహ్లీకి ఇబ్బంది లేదు. పాత జట్టుతోనే బరిలోకి దిగొచ్చు. ప్రస్తుతం 2-0తో ఆధిక్యంలో ఉన్న టీమిండియా నిలకడగా ఆడితే దక్షిణాఫ్రికాలో సిరీస్ గెలిచి చరిత్ర సృష్టించవచ్చు. మ్యాచ్ జరిగే న్యూలాండ్స్ పిచ్ స్వింగ్కు, బౌన్స్కు అనుకూలిస్తుంది. 1992 నుంచి భారత్ ఇక్కడ నాలుగు వన్డేలు ఆడగా రెండు గెలిచి రెండు ఓడింది.
దక్షిణాఫ్రికాలో 1992-93, 2010-11లో పర్యటించిన భారత జట్టు ద్వైపాక్షిక సిరీసుల్లో రెండు మ్యాచులు గెలిచింది. రెండో పర్యటనలో 2-1తో ఆధిక్యంలో ఉన్న టీమిండియా వరుసగా మూడు మ్యాచులు ఓడి చివరికి 3-2తో సిరీస్ చేజార్చుకుంది. మరోసారి 5-2తో వెనకబడ్డారు. అయితే ప్రస్తుతం ఆతిథ్య జట్టు ఉన్న పరిస్థితుల్లో భారత్ సిరీస్ గెలపుపై అశలు రెట్టింపయ్యాయి. ‘మిస్టర్ 360’ డిగ్రీ బ్యాట్స్మన్ ఏబీ డివిలియర్స్, తొలి వన్డేలో శతకం సాధించిన సారథి డుప్లెసిస్ వేలి గాయాలతో జట్టును వీడారు. తాజాగా మరో సీనియర్ ఆటగాడు, కోహ్లీసేనపై అద్భుత రికార్డు ఉన్న వికెట్ కీపర్ బ్యాట్స్మన్ క్వింటన్ డికాక్ మణికట్టు గాయంతో సిరీస్కు దూరమయ్యాడు. అతడి స్థానంలో కొత్త కుర్రాడు హెన్రిచ్ అరంగేట్రం చేసే అవకాశాలు ఉన్నాయి.
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్స్ట్రైకర్ ఎండ్లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more