ముంబైలోని వాంఖేడ్ స్టేడియం వేదికగా న్యూజీలాండ్ తో జరిగిన తొలి వన్డేలో తమ జట్టు ఓటమి పాలుకావడానికి పూర్తి సామర్థ్యాన్ని ప్రదర్శించకపోవడమేనని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ అన్నాడు. తమ జట్టు బ్యాటింగ్ లో మరింతగా రాణించాల్సి వుందని.. మరో 30 నుంచి 40 పరుగులు చేసి వుంటే విజయం తమనే వరిందేదని అభిప్రాయపడ్డాడు. పూర్తి స్థాయి బ్యాటింగ చేయకపోవడమే తమ ఓటమికి ప్రధాన కారణమన్నాడు. మరింత మెరుగైన బ్యాటింగ చేసి వుండివుంటే.. మరిన్ని పరుగుల్ని స్కోరు బోర్డుపై ఉంచగలిగే వాళ్లమని, దాంతో ప్రత్యర్థి జట్టులో అందోళన వ్యక్తమై విజయం సాధించేవాళ్లమని అన్నాడు.
తాము బ్యాటింగ్ దిగిన సమయంలో నిర్దేశించుకున్న టార్గెట్ వేరు. అయితే అచరణలో దానికన్నా 20-30 పరుగులు తక్కువే చేశామని అన్నాడు. తాము లక్ష్యాన్ని నిర్దేశించిన దానికి మరో 40 పరుగులు అదనంగా చేయాల్సిందని అన్నాడు. టాపార్డర్ విఫలం కావడం వల్ల అనుకున్న పరుగుల్ని సాధించలేకపోయామని అదే తమ జట్టుపై ప్రభావం చూపి..ఓటమికి కారణమయ్యిందని కోహ్లీ మ్యాచ్ అనంతరం మీడియాతో మాట్లాడుతూ అన్నాడు.
ఇదిలా ఉంచితే, రెండొంద పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్సి కివీస్ కు శుభారంభాన్ని అందించిన టామ్ లాథమ్-రాస్ టేలర్ లపై కోహ్లి ప్రశంసల వర్షం కురిపించాడు.ఇక్కడ 275 పరుగులు మంచి స్కోరు అనుకున్నప్పటికీ, దాన్ని లాథమ్-టేలర్ తిప్పికొట్టారన్నాడు. తమకు ఎటువంటి అవకాశం ఇవ్వకుండా కివీస్ గెలుపులో కీలక పాత్ర పోషించారన్నాడు. కచ్చితంగా న్యూజిలాండ్ గెలుపు వారిద్దరిదే అనడంలో ఎటువంటి సందేహం లేదని కోహ్లి కొనియాడాడు.
కొన్ని మ్యాచ్ ల నుంచి కేఎల్ రాహుల్ ను పక్కనబెట్టడాన్ని టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ ప్రశ్నించాడు. ముఖ్యంగా న్యూజిలాండ్ తో వన్డే సిరీస్ కు రాహుల్ ను పక్కన పెట్టడంపై విస్మయం వ్యక్తం చేశాడు. భారత క్రికెట్ కు రాహుల్ ఒక ఆశాకిరణమని... అలాంటి ఆటగాడు జట్టులో లేకపోవడం సరైనది కాదని దాదా అన్నాడు. రాహుల్ జట్టులో ఉండటం చాలా అవసరమని... వెంటనే అతన్ని ఆడించే ప్రయత్నం చేయాలని తెలిపాడు. విదేశీ పర్యటనల్లో కూడా రాహుల్ బాగా రాణించాడని... టాలెంట్ ను పక్కన పెట్టకుండా రాహుల్ ను ప్రోత్సహించాలని సూచించాడు.
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్స్ట్రైకర్ ఎండ్లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more