టీమిండియాను వెనక్కి తోసిరాజుతూ సౌతాఫ్రికా అగ్రస్థానానికి దూసుకెళ్లింది. ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్లో ఏకంగా టాప్ ప్లేస్ ను అందుకుంది. ఈ మేరకు ఐసీసీ తాజాగా విడుదల చేసిన ర్యాంకింగ్స్ లో సఫారీలు ప్రథమ స్థానానికి ఎగబాకగా, టీమిండియా రెండో స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. బంగ్లాదేశ్ తో వన్డే సిరీస్ లో మరో మ్యాచ్ మిగలివున్న క్రమంలోనే దక్షిణాప్రికా తన జోరును కొనసాగించింది. ఆస్ర్టేలియాపై 4-1తో సిరీస్ విజయం సాధించిన కోహ్లీసేన ఐసీసీ ర్యాంకింగ్స్ లో అగ్రస్థానాన్ని దక్కించుకోగా.. దానిని తోసిరాజుతూ దక్షిణాఫ్రికా ముందుకు దూసుకెళ్లింది.
బంగ్లాదేశ్ తో జరుగుతున్న వన్డే సిరీస్లో వరుస విజయాలు సాధిస్తున్న సఫారీలు తిరిగి తొలి స్థానాన్ని అందుకున్నారు. ఇరు జట్లు 120 పాయింట్లతో ఉన్నప్పటికే దశాంశాలు తేడాతో సఫారీలు తొలిస్థానంలో కొనసాగుతోంది. టీమిండియా తిరిగి అగ్రస్థానాన్ని అందుకోవాలంటే ఈ నెల 22 నుంచి న్యూజిలాండ్ తో జరగనున్న వన్డే సిరీస్లో తమ ఫామ్ను కొనసాగించాల్సిందే. ఇక బ్యాట్స్ మెన్ ర్యాంకింగ్ విషయానికి వస్తే.. వచ్చిరాగానే అద్భుతమైన సెంచరీతో చెలరేగిన ఏబీ డెవిలియర్స్ మొదటి స్థానాన్ని దక్కించుకున్నారు. దీంతో పరుగుల వీరుడిగా పేరోందిన టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ రెండో స్థానానికి పరిమితమయ్యాడు. ఓపెనర్ రోహిత్శర్మ రెండు స్థానాలు దిగజారీ ఏడో స్థానంలో కొనసాగుతున్నాడు.
ఇక బౌలింగ్ విభాగంలో.. టీమిండియా నుంచి టాప్ టెన్లో ఇద్దరు బౌలర్లకు చోటు దక్కింది. డెత్ ఓవర్స్ స్పెషలీస్ట్ జస్పీత్ బూమ్రాకు ఆరోస్థానం దక్కగా.. స్పిన్నర్ అక్షర్ పటేల్ ఎనిమిదో స్థానంలో ఉన్నాడు. ఈ విభాగంలో తొలి స్థానాన్ని పాకిస్తాన్ కు చెందిన హసన్ అలీ చేజిక్కించుకున్నాడు. ప్రస్తుతం శ్రీలంకతో జరుగుతున్న వన్డే సిరీస్లో ఇప్పటికే 9 వికెట్లు తీసిన హసన్ అలీ ఐసీసీ ర్యాంకింగ్స్లో తొలి స్థానాన్ని దక్కించుకోవడం ఇదే తొలిసారి.. కాగా.. ఈ ఏడాది ఇప్పటివరకు ఐదుగురు బౌలర్లు మొదటి స్థానాన్ని దక్కించుకున్నారు.
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్స్ట్రైకర్ ఎండ్లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more