యాషెస్ సిరీస్ నేపథ్యంలో ప్రత్యర్థి ఇంగ్లాండ్ పై అప్పుడే అస్ట్రేలియా మైండ్ గేమ్ ప్రారంభించింది. సిరీస్ కోసం పర్యటనకు వస్తున్న ఇంగ్లాండ్ ను లక్ష్యంగా చేసుకొని మాటలు సంధిస్తున్నాడు. ఇంగ్లాండ్ తో క్రికెట్ ఆడటమంటే ‘యుద్ధం’ లాంటిదే అని ఆస్ట్రేలియా విధ్వంసకర ఓపెనర్ డేవిడ్ వార్నర్ అన్నారు. 2013లో బ్రిస్బేన్ లో జరిగిన తొలి టెస్టులో ఆసీస్ పేస్ దాడికి ఇంగ్లిష్ ఆటగాళ్ల కళ్లలో భయం కనిపించిందని అప్పడు వార్నర్ అన్నారు. త్వరలో జరిగే యాషెస్ సందర్భంగా ఇలాంటి మాటలతోనే కవ్వింపులు మొదలుపెట్టారు.
తమకు గర్వించదగ్గ చరిత్రతో పాటు గర్వ కూడా వున్నాయని అన్నారు. ఎప్పుడైతే ఆ బాటలో అడుగు పెడతామో అప్పుడది యుద్ధమేనన్నారు. వీలైనంత త్వరగా పోరులో అడుగు పెట్టేందుకు ప్రయత్నించాలన్నారు. తాను ప్రత్యర్థి కళ్లలోకి నేరుగా చూస్తూ అతడిపై ఎలా అయిష్టత పెంచాలన్న దానిపై పనిచేస్తానన్నారు. అతడిపై ఆధిపత్యం చలాయిస్తానని ధీమా వ్యక్తం చేశారు. ప్రత్యర్థిని దెబ్బతీయాలంటే అలాంటి నిప్పు రవ్వలు రాజేయాలని అన్నారు.
వారిపై అలాంటి శత్రుత్వం పెంచుకుంటేనే శక్తివంచన లేకుండా కసితో పోరాడగలమని వార్నర్ అన్నారు. వారం క్రితమే ఇంగ్లాండ్ ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్ ను లక్ష్యంగా చేసుకోవాలని అతడిపై ద్వేషం ప్రదర్శించాలని మిచెల్ స్టార్క్ అభిమానులకు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. యాషెస్ సిరీస్ ను ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటాయి. ఇది భారత్, పాకిస్థాన్ క్రికెట్ పోరును తలపిస్తుంది. ఆటగాళ్లు, అభిమానులు తీవ్ర ఉద్వేగంతో ఉంటారు.
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్స్ట్రైకర్ ఎండ్లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more