ఆస్ట్రేలియాతో 3 మ్యాచుల టీ20 సిరీస్ లో స్థానం సంపాదించుకున్న టీమిండియా సీనియర్ మీడియం పేసర్ .. ఆశిష్ నెహ్రా జట్టులో చోటు దక్కడంపై స్పందిస్తూ.. టీమిండియా జట్టులో స్థానం లభించడం.. దేశం కోసం అడటంతో ఎవరికి మాత్రం అనందంగా వుండదని అన్నాడు. ఇంగ్లాండ్ తో జరిగిన సిరీస్ లో బరిలోకి దిగిన నెహ్రా.. గాయంతో జట్టుకు దూరమయ్యాడు. దీంతో మళ్లి ఫిట్ గా మారిన నెహ్రాను జట్టు సెలక్టర్లు అసీస్ తో టీ20లకు ఎంపిక చేశారు. తన వయస్సు దృష్ట్యా దీర్ఘకాల లక్ష్యాలేమీ నిర్ధేశించుకోనని చెప్పాడు.
ఈ సందర్భంగా నెహ్రా మాట్లాడుతూ.. 3 టీ20 మ్యాచుల కోసం తనను ఎంపిక చేశారని, అయితే తాను ఒక్కో టీ20 కోసం అలోచిస్తానని చెప్పారు. తాను అడితే వార్తేనని చెప్పిన నెహ్రా.. తాను అడకపోతే మరింత పెద్ద వార్త అవుతుందని కూడా చెప్పారు. తన గురించి సామాజిక మాద్యమంలో ఎవరేం మాట్లాడుతున్నారో కూడా తెలియదని, అందుకు కారణం తాను సోషల్ మీడియాను ఫాలో కానని చెప్పాడు. అయితే సోషల్ మీడియాలో కనిపించడు.. ఇప్పుడు టీమీండియాలోకి వచ్చాడని నెట్ జనులు చర్చించుకోవచ్చునని అన్నాడు.
అయితే గాయం బారిన పడిన తాను ఈ సమయంలో తన శిక్షణ షెడ్యూల్ను పూర్తిచేసుకున్నానని, ఫూర్తి ఫిట్ గా తయారై వచ్చానని అన్నారు. తానేం చేస్తున్నానో కెప్టెన్ విరాట్ కోహ్లీతో పాటు చీఫ్ సెలెక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ కు పూర్తిగా తెలుసునని చెప్పాడు. వచ్చే ఏడాది ఫిబ్రవరి నాటికి తన అంతర్జాతీయ కెరీర్ 19 ఏళ్ళు పూర్తవుతుందని, చెప్పాడు. తాను హర్భజన్.. అజహారుద్దీన్ సారథ్యంలో అరంగేట్రం చేశామని గుర్తు చేసుకున్నాడు. అజ్జూ ఆధ్వర్యంలో ఆట మొదలుపెట్టిన ఆటగాడిని ప్రస్తుత జట్టులో వున్నది తానొక్కడినేని చెప్పిన నెహ్రా.. ఈ ప్రయాణంలో తాను ఎప్పుడూ డబ్బుల కోసం మ్యాచ్ అడలేదని కూడా తెలిపాడు
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్స్ట్రైకర్ ఎండ్లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more