దేశ జాతీయ జట్టులో స్థానం దోరికితే ఎగిరి గంతేసే క్రీడాకారులు వున్న ఈ రోజుల్లో.. దేశం తరపున అడుతూ అలుపెరగని విధంగా శ్రమిస్తున్న క్రీడాకారులు కూడా వున్నారు. ఇలాంటి వారి జాబితాలో బంగ్లాదేశ్ ఆల్ రౌండర్ షకిబుల్ హసన్ కూడా వున్నాడు. వరుస మ్యాచ్ లతో పూర్తిగా అలసిపోయిన ఈ అల్ రౌండర్.. తనకు ఒక ఆరు నెలలు బ్రేక్ కావాలని కోరుతున్నారు. ఈ మేరకు రెండు రోజుల క్రితం బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు(బీసీబీ)కి షకిబుల్ లేఖ రాశారు. గత కొన్ని నెలలుగా పని ఒత్తిడితో సతమవుతున్న షకిబుల్.. దాన్ని అధిగమించడానికి సుదీర్ఘ విశ్రాంతి ఇవ్వమని లేఖలో పేర్కొన్నారు.
అయితే ఈ విషయాన్ని బీసీబీ మీడియా కమిటీ చైర్మన్ జలల్ యూనస్ తాజాగా ధృవీకరించారు. టెస్టు క్రికెట్ నుంచి ఆరు నెలల పాటు విశ్రాంతి ఇవ్వమని షకిబుల్ అడిగారని, దానిని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు సీరియస్ గా పరిశీలిస్తుందని, షకిబుల్ కు చిన్నపాటి విరామం ఇచ్చే అవకాశం ఉందన్నారు. అంతర్జాతీయ షెడ్యూల్ ప్రకారం ఒక ఆటగాడికి ఆరు నెలల విశ్రాంతి అంటే కష్టమన్నారు. ఇటీవల ఆస్ట్రేలియాతో జరిగిన రెండు టెస్టుల సిరీస్ లో బంగ్లాదేశ్ తొలి టెస్టును గెలిచి చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే. ఆసీస్ పై తొలిసారి టెస్టును గెలుచుకుని బంగ్లాదేశ్ కొత్త చరిత్రను రాసింది.
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్స్ట్రైకర్ ఎండ్లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more