శ్రీలంక పర్యటనను టీమిండియా ఘనంగా ముగించింది. మునుపెన్నడూ లేని విధంగా పరాయిగడ్డపై పర్యటనలొ భాగంగా అడిన అన్ని మ్యాచులను టీమిండియా తన ఖాతాలో వేసుకుని.. అతిథ్యజట్టుకు తేరుకోలేని విధంగా షాక్ ఇచ్చింది. మూడు మ్యాచుల టెస్ట్ సిరీస్ క్లీన్ స్వీప్ చేసిన విరాట్ సేన, ఐదు మ్యాచుల వన్డే సిరీస్ ను వైట్ వాష్ చేసి.. ఇటు టీ 20ని కూడా తన ఖాతాలో వేసుకుని రికార్డు విజయాన్ని అందుకుంది.
టీ20 మ్యాచులో విరాట్ కోహ్లీ తనదైన శైలిలో కెప్టెన్ ఇన్నింగ్స్ అడి.. టీమిండియాను విజయతీరాలకు చేర్చే క్రమంలో పెవిలియన్ బాట పట్టాడు. కాగా కెప్టెన్ కు తోడుగా రాణించిన మనీష్ పాండే జట్టును ధీటుగా విజయంవైపు నడిపించాడు. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న కోహ్లీ నిర్ణయంతో బ్యాటింగ్ బరిలోకి దిగిన శ్రీలంకను.. భారత బౌలర్లు కట్టడి చేయడంలో రాణించారు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో శ్రీలంక కేవలం ఏడు వికెట్ల నష్టానికి 170 పరుగులు చేసింది. యుజ్వేంద్ర చాహల్ మూడు వికెట్లు తీసి లంకను దెబ్బకొట్టాడు. కుల్దీప్ యాదవ్ 2, భువి, బుమ్రా తలో వికెట్ సాధించారు.
171 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా 22 పరుగుల వద్ద ఓపెనర్ రోహిత్ శర్మ (9) వికెట్ను కోల్పోయింది. అనంతరం క్రీజులోకి వచ్చిన కెప్టెన్ కోహ్లీ.. లోకేశ్ రాహుల్ (24)తో కలిసి రెచ్చిపోయాడు. 54 బంతుల్లో 7 ఫోర్లు, సిక్సర్తో స్కోరు బోర్డును ఉరకలెత్తించాడు. ఈ క్రమంలో 82 పరుగుల వద్ద అవుటయ్యాడు. మనీష్ పాండే 36 బంతుల్లో 4 ఫోర్లు, సిక్సర్తో 51 పరుగులు (నాటౌట్) చేసి విజయంలో కీలక పాత్ర పోషించాడు. దీంతో భారత్ మరో నాలుగు బంతులు ఉండగానే 174 పరుగులు చేసి విజయం సాధించింది. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్, ప్లేయర్ ఆఫ్ ది సిరీస్లు రెండూ కెప్టెన్ కోహ్లీని వరించాయి.
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్స్ట్రైకర్ ఎండ్లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more