విండీస్ క్రికెట్ బోర్డు ఎట్టకేలకు విండీస్ క్రికెట్ అభిమానులకు శుభవార్తను అందించింది. అయితే ఈ వార్త కాస్తా ఇంగ్లాండ్ డ్రెస్పింగ్ రూమ్ కు చెమటలు పట్టిస్తుంది. దాదాపుగా రెండేళ్ల సుదీర్ఘ విరామం తరువాత విండీస్ డాషింగ్ ఓపెనర్ క్రిస్ గేల్ కు వన్డే జట్టులో చోటు దక్కింది. ఇటీవల భారత్ తో్ జరిగిన ట్వంటీ 20 మ్యాచులో ఆడిన గేల్.. విండీస్ తరపున వన్డే ఆడి 29 నెలలు అయ్యింది. 2015 మార్చిలో గేల్ చివరిసారి వన్డే జట్టులో కనిపించాడు. ఆ తరువాత ఇంతకాలానికి గేల్ కు వన్డే జట్టులో స్థానం లభించింది.
ఇంగ్లాండ్ తో వన్డే సిరీస్ లో భాగంగా విండీస్ క్రికెట్ బోర్డు మళ్లీ పాత దిగ్గజాలకే ఓటు వేస్తూ.. వారినే ఎంపిక చేసి వారికి ఎంపిక చేసింది. విండీస్ విధ్వంసకర అటగాడిగా పేరొందిన క్రిస్ గేల్ కు ఇంగ్లాండ్ తో జరగనున్న వన్డే సిరీస్ లకు ఎంపిక చేయడంపై సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ఈ మేరకు 15 మంది సభ్యులతో కూడిన జట్టును విండీస్ క్రికెట్ బోర్డు ఇవాళ ప్రకటించింది. గేల్ తో పాటు మార్లోన్ శామ్యూల్స్ కు విండీస్ వన్డే జట్టులో చోటు దక్కింది. 2016 అక్టోబర్ లో శామ్యూల్స్ చివరగా వన్డే ఆడాడు. వీరిద్దరి ఎంపిక జట్టుకు అదనపు బలాన్ని తీసుకొస్తుందని విండీస్ సెలక్షన్ ప్యానల్ చైర్మన్ కర్టనీ బ్రౌన్ అభిప్రాయపడ్డారు.
దాంతోపాటు వీరి అనుభవం యువ క్రికెటర్లకు లాభిస్తుందని బ్రౌన్ పేర్కొన్నారు. అయితే ఆల్ రౌండర్ డ్వేన్ బ్రేవో కు చోటు కల్పించకపోవడానికి అతను పూర్తి ఫిట్ నెస్ తో లేకపోవడమేనని తెలిపారు. వచ్చే ఏడాది బ్రేవో పునరాగమనం చేసే అవకాశం ఉందన్నారు. గత కొంతకాలంగా విండీస్ క్రికెటర్లకు బోర్డుకు మధ్య కాంట్రాక్ట్ ఫీజుల విషయంలో తీవ్రస్థాయిలో వివాదం నడిచిన సంగతి తెలిసిందే. ఆ నేపథ్యంలో్నే కొంతమంది విండీస్ సినియర్ క్రికెటర్లు జట్టుకు దూరమవుతూ వచ్చారు. అయితే ఈ వివాదం కొంతవరకూ పరిష్కారం కావడంతో మళ్లీ వెటరన్ క్రికెటర్ల ఎంపికపై విండీస్ బోర్డు దృష్టి పెట్టింది.
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్స్ట్రైకర్ ఎండ్లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more