టీమిండియా కోచ్ గా తన సత్తాను ఏడాది కాలంలోనే నిరూపించి.. భారత్ కు విజయాలను అందించిన అనీల్ కుంబ్లేను అవమానకర రీతిలో పంపిన బిసిసిఐ.. ఆయనకు సముచిత స్థానం కల్పించివుంటే బాగుండేదని టీమిండియా సీనియర్ అటగాడు గౌతమ్ గంబీర్ అన్నాడు. తన పదవిని పొడగిస్తామని నాన్చుడు ధోరణి అవలంభించి.. అసహనంతో తనకు తానుగా పదవికి కుంబ్లే గుడ్ బై చెప్పేలా చేసిన విధానం సరిగ్గా లేదని అన్నారు. కుంబ్లేకు తగినంత గౌరవం ఇచ్చి జట్టు సేవలకు అతడ్ని ప్రత్యక్షంగా కాకపోయినా పరోక్షంగానైనా వినియోగంచుకుని వుంటే అతడి గౌరవాన్ని కాపాడిన వారయ్యేవారని అన్నాడు.
అనీల్ కుంబ్లే వ్యవహారంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి అతని గౌరవాన్ని కాపడంతో పాటు తన గౌరవాన్ని కూడా కాపాడుకుని వుండివుంటే బాగుండేదన్నాడు. భారత క్రికెట్ కు ఎంతో సేవ చేసిన ఒక దిగ్గజ ఆటగాడి వ్యవహారాన్ని బీసీసీఐ సరిగా హ్యాండిల్ చేయలేదనే అభిప్రాయం సర్వాత్రా వినిపిస్తుందని అన్నాడు. జట్టు విజయాలలో అతని సేవలను వినియోగించుకుని.. ఆ తరువాత అతడ్ని వాడుకుని వదిలేసినట్లుగా వుందని.. అసలు కుంబ్లేను బిసిసిఐ పట్టించుకోలేదని అన్నాడు. బీసీసీఐ నుంచి తగినంత గౌరవం పొందే అర్హత అనీల్ కుంబ్లేకు ఉందన్నాడు.
'కోచ్ గా కుంబ్లే వర్కింగ్ స్టైల్ ఎలా ఉండేది అనే దానిపై లోతైన విశ్లేషణ అనవసరం. ముందు అతనికి మరింత ఎక్కువ గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత బీసీసీఐది. ఒక క్రికెటర్ గా అతను ఎంతో చేశాడు. ఇది అందరికీ తెలిసిన విషయమే. అతని వ్యవహారంలో బీసీసీఐ ప్రొఫెషనల్ గా వ్యవహరిస్తే బాగుండేది. కుంబ్లేను గౌరవంగా సాగనంపడంలో బీసీసీఐ విఫలమైంది. ఈ తరహా విధానం బీసీసీఐ ప్రతిష్టను దెబ్బతీస్తుంది'అని గంభీర్ పేర్కొన్నాడు. ఇదిలా ఉంచితే, కోచ్ ను ఎంపిక చేసి విషయంలో ఆటగాళ్ల పాత్ర అనవసరమన్నాడు. కోచ్ ఎంపిక అనేది క్రికెటర్ల ఉద్యోగం కాదని పేర్కొన్న గంభీర్.. కేవలం ఆటపై మాత్రమే ఫోకస్ చేస్తే మంచిదన్నాడు.
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్స్ట్రైకర్ ఎండ్లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more