శ్రీలంకతో పూర్తిస్థాయిలో జరుగనున్న ద్వైపాక్షిక సిరీస్ లో భాగంగా మరో రెండు రోజుల్లో ఆరంభమయ్యే తొలి టెస్టుకు టీమిండియా డాషింగ్ ఓపెనర్ కేఎల్ రాహుల్ దూరం కానున్నాడు. ఈ బెంగళూరు యువ క్రికెటర్ గత రెండు రోజులుగా తీవ్ర జ్వరంతో బాధపడుతున్నాడు. అయితే జ్వరం నుంచి కొలుకుంటున్నా.. అతడ్ని గాలేలో జరిగే తొలి టెస్టులో అడటం మాత్రం కష్టమేనని బిసిసిఐ ఇవాళ విడుదల చేసిన ఓ ప్రకటనలో తెలిపింది. జ్వరంతో బాధపడుతున్న కారణంగా రాహుల్.. కొలంబో నుంచి బయల్దేరిన జట్టు సభ్యులతో పాటు గాలేకు చేరుకోలేదని కూడా తెలిపింది.
జ్వరం కారణంగా రాహుల్ ఇవాళ ప్రాక్టీస్ సెషన్ ను సైతం మిస్సవుతున్నాడని బిసిసిఐ తెలిపింది. దీని కారణంగానే రాహుల్ తొలి టెస్టుకు దూరం కానున్నాడని బిసిసిఐ తెలిపింది. కాగా ఏప్రిల్ లో ఎడమ భుజానికి గాయం కావడం కారణంగా సర్జరీ చేయించుకున్న నేపథ్యంలో ఇప్పటికే దాదాపు మూడు నెలల పాటు జాతీయ జట్టుకు దూరమైన రాహుల్.. ఐపీఎల్. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ, వెస్టిండీస్ సిరీస్ ల నుంచి తప్పుకున్నాడు.
మూడు నెలల తరువాత తొలి కాంపిటేటివ్ మ్యాచ్ కు సిద్ధమైన రాహుల్.. శ్రీలంక బోర్డు ప్రెసిడెంట్ ఎలెవన్ తో జరిగిన మ్యాచ్ లో హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్నాడు. దీంతో గాలె వేదికగా జరగనున్న తొలి టెస్టులో శిఖర్ ధావన్ తో కలిసి అభినవ్ ముకుంద్ ఇన్నింగ్స్ ప్రారంభించనున్నాట్లు సమాచారం. అయితే అగస్టు 3 నుంచి కొలంబో వేదికగా జరగనున్న రెండో టెస్టుకు రాహుల్ అందుబాటులోకి వస్తాడని బీసీసీఐ అశాభావం వ్యక్తం చేసింది.
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్స్ట్రైకర్ ఎండ్లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more