టీమిండియా ప్రధాన కోచ్ అనిల్ కుంబ్లే పదవీ కాలం ముగిసినా అతన్ని పునర్ నియామకం చేస్తామని.. క్రికెటర్ల నుంచి వచ్చిన ఒత్తిడి నేపథ్యంలో డైలిమాలో పడిన బిసిసిఐ.. తాత్సర ధోరణి అవలంబించడంతో.. కుంబ్లే స్వతహాగా కోచ్ పదవికి రాజీనామా చేసి వెళ్లిపోయారు. ఈ తరుణంలో బిసిసిఐ మరోమారు టీమిండియా కోచ్ పదవికి ధరఖాస్తులను అహ్వానించింది. అయితే మరోమారు కోచ్ అనీల్ కుంబ్లే లాంటి పరాభవం ఎమరెవరికీ ఎదురుకాకూడదని భావించి.. టీమిండియా అటగాళ్ల సూచనల మేరకే కోచ్ ను ఎంపిక చేయాలని భావిస్తుంది.
జూలై 10వ తేదీ తర్వాత టీమిండియాకు హెడ్ కోచ్ ను బీసీసీఐ ప్రకటించనుంది. ఈ విషయాన్ని క్రికెట్ అడ్వైజరీ కమిటీలో సభ్యుడైన సౌరవ్ గంగూలీ ఇప్పటికే ప్రకటించాడు. ఇప్పటికే కోచ్ ఎంపికపై పెద్ద కసరత్తే జరిగింది. అయితే, కోచ్ ఎంపికకు సంబంధించి ఆటగాళ్ల అభిప్రాయాలను కూడా తీసుకుంటే బాగుంటుందని బీసీసీఐ భావిస్తోంది. ఇదే విషయంపై కెప్టెన్ కోహ్లీ స్పందిస్తూ, తమను సంప్రదిస్తే ఆటగాళ్లందరం కలసి అభిప్రాయాన్ని చెబుతామని చెప్పాడు. ఆటగాళ్లందరిదీ ఒకే అభిప్రాయం ఉంటుందని తెలిపాడు.
ఈ నేపథ్యంలో బీసీసీఐ సీఈవో రాహుల్ జోహ్రీ జమైకాకు వెళ్లారు. ఈ సాయంత్రం టీమిండియా ప్లేయర్లతో ఆయన భేటీ అయి, హెడ్ కోచ్ పై వారి అభిప్రాయాలను సేకరించనున్నారు. ప్రస్తుతం కోచ్ పదవి కోసం రవిశాస్త్రి, సెహ్వాగ్, టామ్ మూడీల మధ్య పోటీ నెలకొంది. అయితే, టీమిండియా డైరెక్టర్ గా పని చేసిన అనుభవం రవిశాస్త్రికి లాభించనుందని తెలుస్తోంది. ఇక అటగాళ్లు కూడా రవిశాస్త్రి వైపే మొగ్గు చూసుతున్నారని సమాచారం. ఇప్పటికే ఈ విషయంలో రవిశాస్త్రీకే అధికంగా అవకాశాలున్నాయని టీమిండియా దిగ్గజం సునీల్ గవాస్కర్ కూడా వ్యాఖ్యనించారు.
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్స్ట్రైకర్ ఎండ్లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more