భారత క్రికెట్ జట్టు ప్రధాన కోచ్ పదవికి టీమిండియా మాజీ డైరెక్టర్ రవిశాస్త్రికి రమారమి దక్కే అవకాశాలున్నాయని వార్తలు అందుతున్నా అది ఆయనకు నల్లేరుపై నడక కాదని కూడా వాదనలను వినిపిస్తున్నాయి. వీరేంద్ర సెహ్వాగ్, టామ్ మూడీ, ఫిల్ సిమన్స్, రిచర్డ్ ఫైబస్, దొడ్డా గణేశ్, లాల్చంద్ రాజ్పుత్ కూడా కోచ్ పదవికి రేసులో నిలిచారు. తాజాగా భారత జట్టు మాజీ సారథి సునీల్ గావస్కర్... కోచ్ పదవి రవిశాస్త్రికే దక్కే అవకాశాలున్నాయని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. అయితే రవిశాస్త్రితో సమానంగావిదేశీ కోచ్ కు కూడా అవకవాశాలు మెండుగానే వున్నాయని అందుకు వారి ట్రాక్ రికార్డే కారణమని తెలుస్తుంది.
ఎందుకంటే.. ఐపీఎల్లో సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుకి కోచ్గా బాధ్యతలు అందించాడు టామ్ మూడీ. అతను శ్రీలంక జట్టుకి కోచ్గా వ్యవహరించాడు. అంతర్జాతీయ క్రికెట్లో చాలా ఏళ్లు కొనసాగిన టామ్ మూడీకి అపారమైన అనుభవం ఉంది. ఐపీఎల్ ద్వారా భారత ఆటగాళ్లను అతను ప్రత్యక్షంగా గమనించిన అనుభవం కూడా ఉంది. అతను ఈ పదవికి పూర్తి అర్హుడు అని వివిధ దేశాలకు చెందిన మాజీ క్రికెటర్లు తమ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఆ తర్వాత పోటీ విండీస్కి చెందిన ఫిల్ సిమన్స్ నుంచి. విండీస్ జట్టు టీ20 ప్రపంచ కప్ సాధించడంలో ఫిల్ కీలకపాత్ర పోషించాడు. జింబాబ్వే, ఐర్లాండ్ జట్లకు అతను కోచ్ బాధ్యతలు అందించిన అనుభవం ఉంది. సిమన్స్ ఆధ్వర్యంలో ఎందరో యువ ఆటగాళ్లు వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే.
ఆ తర్వాత పోటీదారుడు దక్షిణాఫ్రికాకు చెందిన రిచర్డ్ పైబస్. పాకిస్థాన్, బంగ్లాదేశ్ జట్లకు పైబస్ కోచ్గా వ్యవహరించాడు. అంతేకాకుండా పలు డొమిస్టిక్ సర్క్యూట్లోని జట్లకు పైబస్ పని చేశాడు. అతని హయాంలో జట్లు కీలక విజయాలు సాధించాయి. ఆటగాళ్లలో స్ఫూర్తి నింపడంలో పైబస్కు తనదైన ప్రత్యేకత ఉంది. దీంతో రవిశాస్త్రికి విదేశీ కోచ్ల నుంచి పోటీ తీవ్రంగానే ఉండవచ్చని అంటున్నారు. భారత జట్టు సారథి కోహ్లీ.. రవిశాస్త్రికి తన మద్దతిచ్చినట్లు గతంలో వార్తలు వచ్చాయి. దరఖాస్తుల స్వీకరణకు బీసీసీఐ జులై 9 వరకు గడువు ఇచ్చింది. గంగూలీ, సచిన్, లక్ష్మణ్తో కూడిన క్రికెట్ సలహా మండలి జులై 10న దరఖాస్తుదారులకు ఇంటర్వ్యూలు నిర్వహించి కోచ్ ఎవరో తేల్చనుంది. స్వదేశీయులకే కోచ్ పదవిని కట్టబెట్టాలని బీసీసీఐ భావిస్తోంది. మరి చివరికి ఆ అవకాశం ఎవరికి దక్కుతుందో వేచిచూడాలి.
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్స్ట్రైకర్ ఎండ్లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more