నిర్దేశించింది స్వల్ఫ లక్ష్యమే అయినా టీమిండియాను చిత్తు చేసి విండీస్ ఘన విజయం సాధించింది. నాలుగో వన్డేలో విండీస్ 11 పరుగుల తేడాతో భారత్పై విజయం సాధించింది. విండీస్ నిర్దేశించిన 190 పరుగుల ఓ మాదిరి విజయ లక్ష్యాన్ని ఛేదించేందుకు టీమిండియా బ్యాట్స్మెన్ ఆపసోపాలు పడ్డారు. తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న విండీస్ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 189 పరుగులు చేసింది. ఎవిన్ లెవిస్ 35, కైల్ హోప్ 35, షాయ్ హోప్ 25, రోస్టన్ చేజ్ 24, జాసన్ మహ్మద్ 20 పరుగులు చేశారు. మిగతా బ్యాట్స్మెన్ రెండంకెల పరుగులు సాధించేందుకు అస్థలు పడ్డారు. ఫలితంగా నిర్ణీత ఓవర్లలో విండీస్ 9 వికెట్ల నష్టానికి 189 పరుగులు చేసింది.
భారత బౌలర్లలో ఉమేశ్ యాదవ్, హార్ధిక్ పాండ్యా చెరో మూడు వికెట్లు నేలకూల్చగా కుల్దీప్ యాదవ్ రెండు వికెట్లు తీసుకున్నాడు. విండీస్ బౌలర్ల దెబ్బకు 49.4 ఓవర్లలోనే 178 పరుగులకు ఆలౌటైంది. విండీస్ కెప్టెన్, మీడియం పేసర్ అయిన జాసన్ హోల్డర్ దాటికి టీమిండియా బ్యాటింగ్ పేకమేడలా కూలింది. ఇక విండీస్ లో 9.4 ఓవర్లు వేసిన హోల్డర్ రెండు మెయిడెన్లు వేసి 27 పరుగులిచ్చి 5 వికెట్లు తీసి భారత్ నడ్డి విరిచాడు. అల్జరి జోసెఫ్ 2, దేవేంద్ర బిషూ, విలియమ్స్, ఆష్లే నర్స్ తలా ఓ వికెట్ తీసి మిగతా పనిని పూర్తి చేశారు. టీమిండియా ఓపెనర్ అజింక్య రహానే (60), మహేంద్ర సింగ్ ధోనీ (54), హార్ధిక్ పాండ్యా (20) మినహా మరెవరూ చెప్పుకోదగ్గ స్కోరు చేయలేదు. శిఖర్ ధవన్ 5, కెప్టెన్ కోహ్లీ 3, దినేశ్ కార్తీక్ 2, కేదార్ జాదవ్ 10, రవీంద్ర జడేజా 11, కుల్దీప్ యాదవ్ 2, ఉమేశ్ యాదవ్ 0, మహ్మద్ షమీ 1 పరుగు చేశారు.
ఫలితంగా 11 పరుగుల తేడాతో భారత్ పరాజయం పాలైంది. హోల్డర్కు ప్లేయర్ ఆఫ్ మ్యాచ్ అవార్డు లభించింది. ఈ గెలుపుతో విండీస్ 1-2తో భారత్ ఆధిక్యాన్ని తగ్గించింది. సిరీస్ ఫలితం 6 వ తేదీన జరగనున్న చివరి వన్డేకు మారింది.
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్స్ట్రైకర్ ఎండ్లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more