ఐసీసీ పురుషులు ప్రపంచ కప్ ముగియడంలో.. ఇక మహిళల కప్ కోసం ఈ నెల 24 నుంచి పోరు ప్రారంభం కానుంది. ఈ వేడుకకు కూడా ఇంగ్లాండ్ అతిథ్యమివ్వనుంది. కాగా తొలి మ్యాచులో ఆతిథ్య ఇంగ్లాండ్ జట్టుతో టీమిండియా తలపడనుంది. కాగా ఈ ప్రతిష్టాత్మక వేడుకకు ముందు టోర్నీలో పాల్గొనే జట్ల సారథుల కోసం నిర్వాహకులు ప్రత్యేక విందు కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. భారత సారథి మిథాలీరాజ్ ఈ విందుకు హాజరయ్యారు. క్రికెటర్లతో పాటు వివిధ దేశాలకు చెందిన మీడియా సిబ్బంది ఈ కార్యక్రమానికి విచ్చేశారు.
ప్రత్యేక విందు కార్యక్రమం అనంతరం నిర్వహించిన విలేకరుల సమావేశంలో పాక్ విలేకరి అడిగిన ప్రశ్నకు మిథాలీ దిమ్మదిరిగి మైండ్ బ్లాండ్ అయ్యే సమాధానం ఇచ్చింది. దీంతో పాకిస్థాన్ జర్నలిస్టు చిన్నబుచ్చుకోవడం తప్ప ఏమీ అనలేని పరిస్థితికి చేరుకున్నాడు. అంలటితో అగకుండా పాకిస్థాన్ జర్నలిస్టుకు మిథాలీ ఎదురు ప్రశ్నలు సంధించడంతో బిక్కముఖం వేసుకున్నాడు. ఇంతకీ విలేకరి అడిగిన ప్రశ్న ఏమిటీ అనేగా మీ సందేహం.
భారత్, పాకిస్థాన్ జట్టులో మీ అభిమాన క్రికెటర్ ఎవరు అని అడిగాడు. అప్పటి వరకు మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు మిథాలీ సమాధానాలు సవ్యంగా ఇచ్చినా.. పాక్ జర్నలిస్టు ప్రశ్నతో అమెకు చిర్రెత్తుకొచ్చింది. ఇదే ప్రశ్నను మీరు ఏ ఒక్క క్రికెటర్ నైనా అడుగగలరా..? అని ప్రశ్నించింది. మీ అభిమాన మహిళా క్రికెటర్ ఎవరని? వారిని ప్రశ్నించలేని మీరు.. మమ్మల్ని మాత్రం అభిమాన క్రికెటర్ ఎవరని ఎలా అడుగుతున్నారని అమె దగ్ధత స్వరంతో పాక్ విలేఖరిని ప్రశ్నించారు.
వారిని ఎప్పుడూ మీ అభిమాన క్రికెటర్ ఎవరని అడుగుతారే తప్ప మీ అభిమాన మహిళా క్రికెటర్ ఎవరని అడగరు కదా అని అన్నారు. ‘భారత్లో మెన్స్ క్రికెటర్స్కి ఉన్నంత క్రేజ్ మహిళా క్రికెటర్లకు ఉండదు. ఇద్దరి మధ్య చాలా వ్యత్యాసం చూపిస్తారు. మేము మ్యాచ్లు ఆడినా టీవీల్లో కనిపించం. బీసీసీఐ ఇటీవలే సోషల్మీడియా, టీవీల్లో మా మ్యాచులను ప్రత్యక్ష ప్రసారం చేస్తున్నా.. మాకు గుర్తింపు రావడం లేదు ఎందుకని అమె నిలదీశారు. అయితే భారత్, పాకిస్థాన్ రెండు దేశాలలో పరిస్థితులు అలాగే వున్నాయని అమె అన్నారు. తుషార్ అరోద్ తమ జట్టుకి ప్రస్తుతం కోచ్ బాధ్యతలు నిర్వహిస్తున్నారని.. ఆయన నేతృత్వంలో మా జట్టు మంచి విజయాలు సాధిస్తోంది అని మిథాలీ ధీమా వ్యక్తం చేశారు.
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్స్ట్రైకర్ ఎండ్లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more