చాంపియన్స్ ట్రోఫీలో భాగంగా ఎడ్జ్ బాస్టన్ లో పాకిస్తాన్ తో జరిగిన తొలి మ్యచ్ లో వీఐపి అడియన్ల మధ్య కూర్చోని యదేశ్చగా మ్యాచ్ ను వీక్షించిన ఉద్దేశపూర్వక అర్థిక నేరస్థుడు విజయ్ మాల్యా.. అటు టీమిండియా జట్టుతో పాటు అభిమానులకు కనిపించి షాకిచ్చారు. పరారీలో వున్న విలాసాలకు ఏమాత్రం తక్కువ లేదంటూ దర్జాగా భారత్ పాకిస్తాన్ మ్యాచ్ ను వీక్షించాడని మాల్యాపై దాదాపు అన్ని మీడియా చానళ్లు, ఇటు ప్రింట్ మీడియా కూడా వార్తలను ప్రచారం చేశాయి.
దీనిపై స్పందించిన మాల్యా తాను మ్యాచ్ కు రావడంపై మీడియా కవరేజి సెన్సేషనల్గా ఉందని, అయితే తాను మొత్తం అన్ని మ్యాచులకు వచ్చి భారత జట్టును అలరిస్తానని చెప్పాడు. అంతేకాదు ఏకంగా విరాట్ కోహ్లీని పొగడ్తలతో ముంచెత్తాడు. టోర్నీ తొలిమ్యాచ్లోనే పాకిస్తాన్ జట్టును చావుదెబ్బ కొట్టిన టీమిండియాను అభినందించాడు. వరల్డ్ క్లాస్ ప్లేయర్, వరల్డ్ క్లాస్ కెప్టెన్, వరల్డ్ క్లాస్ జెంటిల్మన్ అంటూ పొగిడేశాడు. బ్రేవో విరాట్ అంటూ కితాబిచ్చాడు.
ఇదిలావుండగా, మ్యాచ్ అనంతరం కూడా ఏకంగా విరాట్ కోహ్లీకి షాకిచ్చాడు మాల్యా. విరాట్ కోహ్లీ ఇచ్చిన ఛారిటీ డిన్నర్లో కూడా ప్రత్యక్షమై షాకిచ్చాడు. ఛారిటీ డిన్నర్ కు మాల్యా హాజరైనప్పటికీ, టీమిండియా ఆటగాళ్లెవరూ మాల్యాను పలకరించలేదని బిసిసిఐ తెలిపింది. మాల్యాను ఎదురుగా ఉంచుకుని ఆటగాళ్లు చాలా ఇబ్బందికి గురయ్యారని చెప్పిన బీసీసీఐ ఆయన్ను దూరంగా ఉంచినట్లు పేర్కొంది. స్వదేశంలో వివిధ బ్యాంకులకు దాదాపు రూ. 3వేల కోట్ల వరకు బాకీపడి, వాటిని తీర్చాలని గట్టిగా ఒత్తిడి వస్తుండగానే ఎక్కడ అరెస్టు చేస్తారోనన్న భయంతో రాత్రికి రాత్రే తట్టాబుట్టా సర్థుకుని లండన్ వెళ్లిపోయిన విషయం తెలిసిందే.
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్స్ట్రైకర్ ఎండ్లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more