రాంచీ వేదికగా జేఎస్సీఏ స్టేడియంలో జరుగుతున్న మూడో టెస్టు మ్యాచులో రెండో రోజు తొలి ఇన్నింగ్స్ ను ప్రారంభించిన టీమిండియా అసీస్ కు ధీటుగానే బదులిస్తుంది. రెండో రోజు అటముగిసే సమయానికి భారత్ తొలి ఇన్నింగ్స్ లో వికెట్ నష్టానికి 120 పరుగులు చేసింది. కేఎల్ రాహుల్ 67 రన్స్ చేసి పెవిలియన్ కు వెనుదిరుగగా, మురళీ విజయ్ 42 , పుజారా 10 పరుగులతో క్రీజ్ లో ఉన్నారు. తొలి ఇన్నింగ్స్ లో భారత్ ఆసీస్ కంటే ఇంకా 331 రన్స్ వెనుకబడి ఉంది
అంతకుముందు తొలి ఇన్నింగ్స్ లో రెండో రోజు లంచ్ విరామం తరువాత అస్ట్రేలియా అలౌట్ అయ్యింది. దీంతో విరాట్ సేన ఎదుట 451 పరుగుల లక్ష్యాన్ని నిర్ధేశించింది. అసీస్ జట్టులో కెప్టెన్ స్టీవ్ స్మిత్, జ్లెన్ మాక్స్ వెల్ మినహా ఎవరూ అంతగా రాణించలేదు. అయినా అసీస్ భారీ స్కోరును అతిథ్య జట్టు ముందు ఉంచగలిగింది. ముఖ్యంగా అసీస్ కెప్టెన్ స్మిత్ 178 పరుగలతో అజేయంగా రాణించి కెప్టెన్ ఇన్నింగ్స్ అడాడు.
నాలుగు వికెట్ల నష్టానికి 299 పరుగల ఓవర్ నైట్ స్కోరుతో ఇవాళ్టి అటను ప్రారంభించిన అసీస్ భారీ స్కోరుకు కెప్టెన్ స్మిత్.. మాక్స్ వెల్ మధ్య ఏర్పడిన చక్కని భాగస్వామ్యమే కీలకంగా మారింది. దీంతో 2103లో భారత్ తో జరిగిన టెస్టు మ్యచ్ లోనే టెస్టు క్రికెట్ లోకి అరంగ్రేటం చేసిన అసీస్ బ్యాట్స్ మెన్ జ్లన్ మాక్స్ వెల్ తన టెస్టు క్రికెట్ కెరీర్లో తొలి శతకం నమోదు చేశాడు. అనంతరం నాలుగు పరుగులు జోడించిన మ్యాక్స్వెల్ను 104 పరుగల వద్ద జడేజా పెవిలియన్కు పంపాడంతో భారీ దిశగా సాగుతున్న అసీస్ స్కోరుబోర్డుకు బ్రేక్ పడింది. ఫలితంగా 191 పరుగుల వద్ద ఈ బాగస్వామ్యానికి తెరపడింది.
ఆసీస్ బ్యాట్స్మెన్లలో రెన్షా 44, వార్నర్ 19, మార్ష్ 2, హెచ్.కాంబ్ 19, వాడే 37, కమ్మిన్స్ 0, ఓకీఫ్ 25, లియాన్ 1, హెచ్.వుడ్ 0 పరుగులు చేసి అవుట్ కాగా కెప్టెన్ స్మిత్ మాత్రం 178 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. భారత బౌలర్లలో రవీంద్ర జెడేజా మరోమారు ఐదు వికెట్లను పడగోట్టాడు. భారత బౌలర్లలో జడేజా 5, ఉమేశ్ యాదవ్ 3, అశ్విన్ 1 వికెట్లు తీశారు.
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్స్ట్రైకర్ ఎండ్లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more