బంగ్లాదేశ్ తో జరుగుతున్న ఏకైక టెస్టులో రెండోరోజు ఆటలో ఓ డీఆర్ఎస్ ద్వారా టీమిండియా బంగ్లాదేశ్ తొలివికెట్ ను పడగోట్టింది. 15 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద టీమిండియా సీమర్ ఉమేష్ యాదవ్ వేసిన అద్భుత బంతి బ్యాట్స్ మెన్ ను బీట్ చేస్తూ బ్యాట్ అంచున తగిలి వెళ్లగా కీపర్ సాహా అద్భుతమైన క్యాచ్ అందుకున్నాడు. దీంతో డీఆర్ఎస్ కు వెళ్లడంతో బంగ్లా బ్యాట్స్మెన్ సౌమ్య సర్కార్ వెనుదిరిగాడు. దీంతో బ్యాటింగ్ లో జోడీల మాదరిగా, బౌలింగ్ లో జోడీల మాదిరిగా తాజాగా డీఆరఎస్ లోనూ విరాట్ సాహా మంచి జోడీగా పేర్కొంటున్నారు క్రికెట్ విశ్లేషకులు.
ఇక క్రితం రోజు బంగ్లా డీఆర్ఎస్ ను చేజార్చుకున్న ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. బంగ్లాదేశ్ కెప్టెన్, కీపర్ ముష్ఫికర్ రహీమ్ చేసిన ఓ పనికి భారత కెప్టెన్ విరాట్ కోహ్లీకి కాసేపు నవ్వు ఆగలేదు. నాన్ స్ట్రైకర్ విజయ్ కి విషయాన్ని చెప్పి మరీ నవ్వుకున్నాడు. స్డేడియంలో కాసేపు అందరికీ ఈ సీన్ వినోదాన్ని పంచింది. అసలే ఏమైందంటే.. సెంచరీ వీరుడు మురళీ విజయ్ 101 పరుగులు, విరాట్ కోహ్లీ 31 పరుగుల వద్ద ఉన్నారు. ఆ సమయంలో ఇండియా స్కోరు 223/2. బంగ్లా లెఫ్టార్మ్ స్పిన్నర్ తైజుల్ ఇస్లామ్ వేసిన ఇన్నింగ్స్ 62వ ఓవర్లో ఓ బంతిని కోహ్లీ డిఫెన్స్ చేశాడు.
సరిగ్గా ఆ బంతి కోహ్లీ బ్యాట్ కు మిడిల్ లో తగిలింది. అయితే దీన్ని కెప్టన్ కమ్ కీపర్ ముష్ఫికర్ రహీమ్ అంచనా వేయడంలో పొరపాటు చేశాడు. బంతి కోహ్లీ ప్యాడ్ కు తగిలిందా అని షార్ట్ లెగ్ ఫీల్డర్ తో చర్చించిన ముష్ఫికర్ వెంటనే అంపైర్ ను ఎల్బీడబ్ల్యూ కోసం రివ్యూ కోరాడు. దీంతో కోహ్లీకి పట్టరాని సంతోషం వేసింది. బంగ్లా ఓ రివ్యూను ఇంత సులువుగా కోల్పోతుందన్న విషయం తెలిసిన కోహ్లీ, నాన్ స్ట్రైకర్ విజయ్ తో కలిసి బంతి, బ్యాట్ కు ఎక్కడ తగిలిందో చెప్పి రివ్యూ నిర్ణయం వెలువడే వరకు నవ్వుతూ కనిపించాడు. అనంతరం విజయ్ (108) ఔట్ కాగా, కోహ్లీ మాత్రం తొలిరోజు ఆట నిలిపివేసే సమయానికి అజేయ శతకం(111, 141 బంతుల్లో 12 ఫోర్లు)తో, రహానే 45 పరుగులతో నాటౌట్ గా ఉన్నాడు. తొలిరోజు భారత్ 90 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 356 పరుగులు చేసింది.
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్స్ట్రైకర్ ఎండ్లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more