కొత్త జర్సీలో మెరిసిన టీమిండియా క్రికెటర్లు.. Team India's new ODI jersey with high-tech features

Team india s new odi jersey equipped with high tech features

Nike, Team India, Team India new jersey 2017, BCCI, Team india,Virat Kohli, MS Dhoni, Harmanpreet Kaur, cricket news, cricket

Right before the limited-overs matches with England at home, Team India members got a brand new jersey.

కొత్త జర్సీలో మెరిసిన టీమిండియా క్రికెటర్లు..

Posted: 01/13/2017 05:39 PM IST
Team india s new odi jersey equipped with high tech features

భారత్  పర్యటనకు వచ్చిన ఇంగ్లాండ్ జట్టుతో మరో రెండు రోజుల్లో ప్రారంభం కానున్న వన్డే సిరీస్ నేపథ్యంలో టీమిండియా ఆటగాళ్లకు బిసిసిఐ నూతన సంవత్సరం కానుకగా కొత్త జెర్సీని అందించింది. ఇంగ్లండ్ తో వన్డే సిరీస్‍ కు ఈ కొత్త జర్సీతోనే టీమిండియా జట్టు పాల్గోనుంది. కాగా పర్యాటక జట్టుతో వన్డే సమరానికి సన్నద్ధమవుతున్న భారత క్రికెటర్లు, మహిళా ఆటగాళ్లు నూతన జెర్సీ ఆవిష్కరణలో పాల్గొన్నారు.

భారత జెర్సీలో స్వల్ప మార్పులు చేసిన నైకీ సంస్థ, బీసీసీఐతో కలిసి నూతన కిట్ ను ఆవిష్కరించింది. ప్రస్తుతం టీమిండియాకు నైకీ సంస్థ స్పాన్సర్ గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. మహేంద్ర సింగ్ ధోనీ, రవిచంద్రన్ అశ్విన్, విరాట్ కోహ్లీ, అజిక్యా రహానేలతో పాటుగా మహిళా టీమ్ ప్లేయర్స్ మిథాలీ రాజ్, హర్మన్ ప్రీత్ కౌర్ లను ఈ ఫొటోలో చూడవచ్చు. టీమిండియాకు పరిమిత ఓవర్ల క్రికెట్ లో కొత్త కెప్టెన్ తో పాటు కొత్త జెర్సీతో ఈ ఏడాది ప్రారంభించబోతోంది.

గతంలో ప్లాస్టిక్ రీసైకిల్ చేసిన ప్రొడక్ట్స్ తో 2015లో చివరిసారిగా జెర్సీని ప్రవేశపెట్టారు. భుజాల పక్కన భారత త్రివర్ణ పతాక రంగులతో చారలను ప్రింట్ చేశారు. ఈ 15న కోహ్లీ నేతృత్వంలో ఇంగ్లండ్ తో తలపడనున్న టీమిండియా నూతన జెర్సీతో బరిలోకి దిగనుందని బీసీసీఐ ప్రకటించింది. ఈ జెర్సీలో 4డీ క్విక్ నెస్, ట్యూన్డ్ బ్రీతబిలిటీ, జీరో డిస్ట్రాక్షన్ ఫీచర్లు ఉన్నాయని.. ఎండ వేడిమిని తట్టుకునేందుకు జెర్సీ చాలా సౌకర్యంగా ఉంటుందని నైకీ సంస్థ తెలిపింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles