ఇంగ్లండ్తో జరుగుతున్న టెస్టు సిరీస్ లో తొలిటెస్టు తొలిఇన్నింగ్స్లో శతకాన్ని నమోదు చేసినా.. ఆ తరువాత సిరీస్లోని మిగతా టెస్టులలో ఆశించిన స్థాయిలో రాణించకపోవడంతో విమర్శకులు పెట్టిన ఎక్కులన్నింటికీ తన శతకంతో ఓపెనర్ మురళీ విజయ్పై సమాధానం చెప్పాడు. షార్ట్ పిచ్ బంతులను ఎదుర్కోవడంలో ఇబ్బందులు పడటంతో అతనిపై విమర్శకులు తూటాలను సంధించారు. అయితే జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ, కోచ్ అనీల్ కుంబ్లే అతనికి మద్దతునిచ్చారు. అంతే ఇంకేముందు తనకున్న వెన్నదన్నుతో చెలరేగిపోయిన మురళీ విజయ్ ఏకంగా వాంఖేడ్ స్టేడియంలో శతకాన్ని నమోదు చేసి విమర్శకుల నోళ్లకు తాళం వేశాడు.
231 బంతుల్లో 8 ఫోర్లు, 3 సిక్సర్లతో సెంచరీ నమోదు చేశాడు. రెండో రోజు పుజారాతో కీలక భాగస్వామ్యం నమోదు చేసిన విజయ్.. అజేయ అర్ధ సెంచరీతో రెండో రోజు ముగించాడు. 70 పరుగుల వ్యక్తిగత స్కోరుతో మూడో రోజు బ్యాటింగ్ కొనసాగించిన అతను ధాటిగా ఆడాడు. ఫోర్లు, సిక్సర్లతో బౌలర్లపై విరుచుకుపడ్డాడు. పుజారాతో కలిసి రెండో రోజున 107 పరుగుల భాగస్వామ్యం చేసిన మురళీ విజయ్ ఆ తరువాత కెప్టెన్ కోహ్లీతో కలిసి ధాటిగా ఆడుతున్నాడు.
ఇదిలా ఉంచితే గత 14 ఏళ్లుగా టీమిండియా ఓపెనర్లు నుంచి శతకాన్ని చూడాలన్న వాంఖేడ్ స్టేడియంలోని ప్రేక్షకుల కలలు ఇవాళ సఫలీకృతమయ్యాయి. భారత ఓపెనర్ గా 2002లో చివరిసారిగా వీరేంద్ర సెహ్వాగ్ ఇక్కడ టెస్టు సెంచరీ సాధించాడు. ఆ తరువాత ఇంత కాలానికి భారత ఓపెనర్ గా మురళీ విజయ్ ఆ మార్కును చేరాడు. కాగా, గడిచిన ఇరవై ఏళ్ల కాలంలో సెహ్వాగ్, మురళీ విజయ్ లు మాత్రమే భారత ఓపెనర్లుగా సెంచరీలు నమోదు చేసినవారు. ఇంగ్లండ్ తో ఇక్కడ జరుగుతున్న మురళీ విజయ్ సెంచరీ సాధించిన సంగతి తెలిసిందే. 231 బంతుల్లో8 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో శతకం సాధించాడు.
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్స్ట్రైకర్ ఎండ్లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more