టీమిండియాతో టూర్ కు ముందు బంగ్లాదేశ్ జట్టులో జరిగే సిరీస్ కోసం బంగ్లాదేశ్ పర్యటనకు వెళ్లిన ఇంగ్లండ్ క్రికెట్ జట్టులో తాను కొనసాగలేనని, స్వచ్చంధంగా తప్పుకున్న ఇంగ్లాండ్ పరిమిత ఓవర్ల కెప్టెన్ణ ఇయాన్ మోర్గన్.. జట్టులోకి పునరాగమనం చేయనున్నాడు. టీమిండియాతో వచ్చే ఏడాదిలో జరగనున్న మూడు వన్డేల సిరీస్కు మోర్గాన్ తిరిగి జట్టులో స్థానం సంపాదించారు. ఈ మేరకు జట్టు వివరాలను ప్రకటించిన ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు ఆయనను టీమిండియాతో వన్డే సిరీస్ కు ఎంపిక చేసింది. దాంతోపాటు ఇంగ్లండ్ ..వన్డే జట్టు, టీ 20 కెప్టెన్గా మోర్గాన్ పేరును ఖరారు చేస్తూ సెలక్టర్లు నిర్ణయం తీసుకున్నారు.
బంగ్లాదేశ్లో భద్రతపై ఆందోళన వ్యక్తం చేసిన మోర్గాన్ ఆ పర్యటనకు దూరంగా ఉన్నాడు. దాంతో ఇంగ్లండ్ వన్డే కెప్టెన్సీ బాధ్యతలను జాస్ బట్లర్కు అప్పగించాల్సి వచ్చింది. ప్రస్తుతం మోర్గాన్ జట్టుకు అందుబాటులోకి రావడంతో అతనే వన్డే,టీ 20 కెప్టెన్గా వ్యవహరించనున్నాడు. బట్లర్తో పాటు అలెక్స్ హేల్స్లు వన్డే, టీ 20 జట్టులో కలవనున్నారు. మరొకవైపు బంగ్లాదేశ్ పర్యటనలో భాగంగా వన్డే జట్టు నుంచి విశ్రాంతినిచ్చిన జో రూట్ ను భారత్ తో వన్డే సిరీస్ కు ఎంపిక చేశారు.ప్రస్తుతం భారత్ లో పర్యటిస్తున్న ఇంగ్లండ్ టెస్టు జట్టులో రూట్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే.
ఇంగ్లండ్ వన్డే జట్టు: ఇయాన్ మోర్గాన్(కెప్టెన్), మొయిన్ అలీ, బెయిర్ స్టో, జాక్ బాల్, సామ్ బిల్లింగ్స్, జాస్ బట్లర్, డావసన్, హేల్స్, ప్లంకెట్, అదిల్ రషిద్, జో రూట్, బెన్ స్టోక్స్, క్రిస్ వోక్స్
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్స్ట్రైకర్ ఎండ్లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more