ఇంగ్లండ్ క్రికెట్ జట్టుకు స్పిన్ కన్సల్టెంట్గా తన కాలపరిమితి ముగిసినా.. టీమిండియాతో జరుగుతున్న వన్డే సిరీస్ ల నేపథ్యంలో పాకిస్తాన్ దిగ్గజ స్సిన్నర్ సక్లాయిన్ ముస్తాక్ సేవలను ఇంగ్లాండ్ జట్టు పునరుద్దరించుకుంది. దీంతో భారత్ తో జరిగే వన్డే సిరీస్ లకు కూడా ఆయన కన్సల్టెంటుగా వ్యవహరించనున్నారు. టీమిండియా సిరీస్ నేపథ్యంలో సక్లాయిన్ ముస్తాక్ పదవీకాలం పొడిగిస్తూ ఈసీబీ నిర్ణయం తీసుకుంది.
ప్రస్తుతం భారత్ లో పర్యటిస్తున్న ఇంగ్లండ్ జట్టుకు స్పిన్ విభాగంలో సక్లయిన్ సహకారం అందిస్తున్నాడు. తొలుత ఈ టెస్టు సిరీస్ వరకూ సక్లయిన్ ను స్పిన్ కన్సల్టెంట్ గా నియమించిన ఈసీబీ.. వన్డేలకు అతని సేవలకు వినియోగించుకోవాలని భావించింది. ఆ క్రమంలోనే అతన్ని వన్డే సిరీస్ లో కూడా కొనసాగించేందుకు సంసిద్ధత వ్యక్తం చేసింది. ఇంగ్లండ్ జట్టు ప్రధాన స్పిన్నర్లు మొయిన్ అలీ, రషిద్లు.. సక్లయిన్ పర్యవేక్షణలో మెళుకవులు నేర్చుకుంటున్నారు.
తన పదవీ కాలం మరోసారి పొడగించడంపై సక్లయిన్ ఆనందం వ్యక్తం చేశాడు. తనకు ఇంగ్లండ్ జట్టుతో ఎటువంటి ఇబ్బందులు లేవని, బౌలింగ్ కోచ్ గా కానీ, కన్సల్టెంట్ కానీ బాధ్యతలు నిర్వర్తించడం ఒక మంచి అనుభూతి అని పేర్కొన్నాడు. స్పిన్ పాఠాలు నేర్చుకునేందుకు ఇంగ్లండ్ స్పిన్నర్లు చాలా ఆతృతగా ఉన్నారని, దానిలో భాగంగానే ఇప్పటికే వారు ఎంతో పురోగతి సాధించారన్నాడు.
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్స్ట్రైకర్ ఎండ్లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more