ప్రస్తుత క్రికెట్ ప్రపంచంలో భారత టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లి ఒక అరుదైన క్రికెటర్. జట్టుకు విజయాలు అందించడంతో పాటు పరుగుల దాహంతో చెలరేగిపోతున్న ఆటగాడు కోహ్లీ అని చెప్పడంలో ఏ మాత్రం సందేహం లేదు. క్రికెట్ దేవుడిగా ఇప్పటికీ అభిమానుల అధరాభిమానాన్ని సంపాదించిన మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్కు ఒకే ఒక్క వారుసుడిగా మన్ననలు అందుకుంటున్న కోహ్లీ.. ఇప్పటికే కొన్ని రికార్డుల పరంగా చాలా ఎత్తులో ఉన్నాడు. అయితే గత రెండేళ్లలో స్వదేశంలో జరిగిన వన్డే సగటులో ఇప్పటివవరకూ విరాట్ ముందంజలో ఉండగా, ఆ రికార్డును ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవ్ స్మిత్ సవరించాడు.
న్యూజిలాండ్ తో వన్డే మ్యాచ్లో స్వదేశీ యావరేజ్ పరంగా స్మిత్ ముందు వరుసలోకి వచ్చేశాడు. 2015-16 సీజన్ నుంచి చూస్తే16వ ఇన్నింగ్స్ ఆడుతున్న స్మిత్.. 4 సెంచరీలు. 5 హాఫ్ సెంచరీలు నమోదు చేసి వెయ్యికి పైగా పరుగులు చేశాడు. న్యూజిలాండ్ తో వన్డేలో స్మిత్ శతకం సాధించాడు. ఇక్కడ స్మిత్ యావరేజ్ 79.23 కాగా, స్ట్రైక్ రేట్ 95.37 గా ఉంది. ఇది స్వదేశంలో జరిగిన వన్డేల్లో అత్యధిక యావరేజ్గా నమోదైంది.
ఈ కాలంలో స్వదేశంలో విరాట్ 10 వన్డే ఇన్నింగ్స్లు ఆడి రెండు సెంచరీలు, 3 హాఫ్ సెంచరీల సాయంతో 603 పరుగులు చేశాడు. దీనిలో భాగంగానే 75.37 సగటును, 94.81 స్ట్రైక్ రేట్ను సాధించాడు. కాగా, న్యూజిలాండ్ తో వన్డేలో దాన్ని స్మిత్ అధిగమించాడు. మరొకవైపు వన్డేల్లో ఈ ఏడాది వెయ్యి పరుగులు సాధించిన రెండో ఆటగాడిగా స్మిత్ గుర్తింపు సాధించాడు. అంతకుముందు ఆస్ట్రేలియాకు చెందిన డేవిడ్ వార్నర్ ఈ మార్కును చేరిన తొలి ఆటగాడు.
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్స్ట్రైకర్ ఎండ్లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more