సుదీర్ఘ పర్యాటనకు వచ్చిన ఇంగ్లాండ్ జట్టుతో జరిగిన రెండు టెస్టులలో రాజ్ కోట్ టెస్టులో నువ్వా-నేనా అన్నట్లు సాగినా.. విశాఖ టెస్టులో సత్తా చాటిన విరాట్ సేన.. ఇక ఈ నెల 26 నుంచి ప్రారంభం కానున్న మోహాలీ టెస్టులో ఆత్మవిశ్వాసంతో అడుగులు ముందుకు వస్తుండగా ఎదురుదెబ్బ తగిలింది. టీమిండియా పరిమిత ఓవర్ల కెప్టెన్ ధోని తరహాలోనే రనౌట్టు, స్టంపింగ్ లు చేస్తున్న టెస్టు క్రికెట్ వికెట్ కీపర్ వృద్దిమాన్ సాహా గాయం కారణంగా మూడవ టెస్టుకు దూరం అవుతున్నాడు. సాహా స్థానంలో పార్థీవ్కు చోటు కల్పించారు.
ఈ నెల 26 నుంచి మొహాలీలో జరిగే మూడో టెస్ట్కు టీమిండియా వికెట్ కీపర్ అందుబాటులో ఉండడని, అతని స్థానంలో సీనియర్ కీపర్ పార్థీవ్ పటేల్ను తీసుకుంటున్నామని బీసీసీఐ ప్రెస్ నోట్ విడుదల చేసింది. విశాఖలో టెస్టు సందర్భంగా సాహా తొడకండరాల గాయంతో బాధపడ్డాడని, అతడిని పరీక్షించిన వైద్యులు విశ్రాంతి తీసుకోవాలని సూచించారని బీసీసీఐ ఈ నోట్లో పేర్కొంది. కాగా మరో వికెట్ కీపర్ రిషబ్ పంత్ కూడా సమయానికి అందుబాటులో లేకపోవడంతో పార్థివ్ పటేల్ కు అవకాశం లభించింది.
మూడో టెస్టుకు భారత జట్టు
విరాట్ కోహ్లీ(కెప్టెన్), కె లోకేష్ రాహుల్, మురళీ విజయ్, ఛటేశ్వర్ పుజారా, అజింక్య రహానే, పార్థీవ్ పటేల్(కీపర్), రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, జయంత్ యాదవ్, షమీ, అమిత్ మిశ్రా, ఇషాంత్ శర్మ, భువనేశ్వర్ కుమార్, కరుణ్ నాయర్, పాండ్యా
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్స్ట్రైకర్ ఎండ్లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more