ఢిల్లీలోని ఫెరోజ్ షా కోట్ల మైదానం వేదికగా పర్యాటక జట్టు న్యూజీలాండ్ తో జరిగిన రెండో వన్డే ఇంటర్నేషనల్ మ్యాచ్ లో తమ జట్టులోని ఏ ఒక్క బ్యాట్స్ మెన్ కూడా సరిగా రాణించకపోవడయే కారణంగానే పరాజయాన్ని చవిచూశామని టీమిండియా లిమిటెడ్ ఓవర్ల క్రికెట్ కెప్టెన్ ఎంఎస్ ధోనీ అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసిన అయన ఈ మ్యాచ్ లో జట్లులోని ఏ బ్యాట్స్ మెన్ కూడా అశించిన స్థాయిలో రాణించలేదన్నాడు.
తమ జట్టులోని బ్యాట్స్ మెన్ల మద్య దీర్ఘకాల భాగస్వామ్యాలు నమోదు కాకపోవడం కూడా ఓటమి కారణమని అన్నారు. కొన్ని బాగస్వామ్యాలు నమోదైనా, ఆవి ఎక్కువ సమయం నిలబడే క్రమంలో వికెట్లు కోల్పోవడం కూడా ఓటమిపై ప్రభావం చూపిందన్నాడు. అయితే సమిష్టిగా బ్యాట్స్ మెన్లు విఫలం కావడంతోనే తాము ఫిరోజ్ షా కోట్ల మైదానంలోని మ్యాచ్ లో పరాజయం పోందామన్నారు. ఓటమి ఫలానా బ్యాట్స్మెన్ కారణమంటూ ఎవరి పేరును ఆయన ప్రత్యేకంగా ప్రస్తావించ లేదు. అయితే 41వ ఓవర్లో రెండు వికెట్లను కోల్పోవడం మ్యాచ్ పై పట్టుకోల్పోయినట్లు తెలిపాడు.
'మ్యాచ్ ను పరిశీలించి చూడండి. పలు కీలక భాగస్వామ్యాలు నమోదు చేశాం. ఆపై వెంటనే వికెట్లను కోల్పోయాం. ఈ తరహా స్కోరు బోర్డుపై ఉన్నప్పుడు వికెట్లను కాపాడుకోవడం అనేది చాలా ముఖ్యం. అలా చేస్తే పరుగులు అవే వస్తాయి. వికెట్లు చేతిలో ఉంటే ఓవర్ కు ఆరు, ఏడు పరుగులు సాధించడం అంత కష్టమేమీ కాదు. మా ఓటమికి ప్రధాన కారణం మాత్రం స్వల్ప విరామాల్లో వికెట్లను కోల్పోవడమే. ఇది ఒక్క బ్యాట్స్మెన్ను ఉద్దేశించి చెప్పడం లేదు. మొత్తం జట్టంతా బ్యాటింగ్ లో వైఫల్యం చెందింది. నేను జట్టు గెలుపుకోసం 10 శాతం మించి కృషి చేశానని ఏ ఒక్క బాట్య్మెన్ అయినా చెప్పగలడా?' అని ధోని ప్రశ్నించాడు.
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్స్ట్రైకర్ ఎండ్లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more