మూడు టెస్టు మ్యాచ్ ల సిరీస్ లో భాగంగా జరిగిన తొలి టెస్టులో న్యూజీలాండ్ ఓటమిని చవిచూడటంతో.. పర్యటక జట్టుపై మైండ్ గేమ్ అడేందుకు అతిథ్య జట్టు కోచ్ సన్నధమవుతున్నాడు, ఇప్పటికే కాన్పూర్ టెస్టులో ఓటమిని చవిచూసి వెనుకబడిపోయిన న్యూజిలాండ్ పై భారత క్రికెట్ జట్టు ప్రధాన కోచ్ అనిల్ కుంబ్లే మైండ్ గేమ్ ను మొదలు పెట్టేశాడు. ప్రధానంగా కివీస్ స్టార్ ఆటగాడు మార్టిన్ గప్టిల్ ను లక్ష్యంగా చేసుకుని అతన్ని మరింత ఒత్తిడిలోకి నెట్టే యత్నం చేశాడు.
తొలి టెస్టులో ఆకట్టుకోలేకపోయిన గప్టిల్ కు ఇక్కడ పరిస్థితుల్లో ఆడాలంటే అంత ఈజీ కాదంటూ వ్యాఖ్యానించాడు.'గప్టిల్ ఒక నాణ్యమైన ఆటగాడు. అంతే కాదు భారీ షాట్లు కొట్టగల సమర్ధుడు. అయితే ప్రస్తుతం ఫామ్ లేని గప్టిల్ సత్తా చాటుకోవాలంటే ఇక్కడ అంత ఈజీ కాదు. నీ దూకుడు ఇక్కడ పని చేయదు 'అని కుంబ్లే వ్యాఖ్యానించాడు.
గత మ్యాచ్ లో కొనసాగించిన ఆట తీరునే రెండో టెస్టులో కూడా కొనసాగిస్తామని కుంబ్లే ధీమా వ్యక్తం చేశాడు. ఈ మ్యాచ్ ప్రత్యర్థి జట్టుకు అత్యంత కీలకమని, వారి ఓపెనర్లను ముందుగా పెవిలియన్ కు పంపి ఒత్తిడి తెస్తామన్నాడు. మరోవైపు మార్క్ క్రెయిగ్ స్థానంలో జట్టులోకి వచ్చిన జీతన్ పటేల్ ను కుంబ్లే ప్రశంసించాడు. గత కొంతకాలంగా జీతన్ ఆట తీరు ఆకట్టుకుందన్నాడు. రెండో టెస్టులో ఆడబోతున్న జీతన్ బౌలింగ్ ను ఎలా ఎదుర్కోవాలి అనే దానిపై కసరత్తు చేస్తున్నట్లు కుంబ్లే పేర్కొన్నాడు.
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్స్ట్రైకర్ ఎండ్లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more