ఫామ్ కోల్పోయిన తరుణంలో జాతీయ జట్టుకు దూరమైన టీమిండియా ఓపెనర్ గౌతమ్ గంభీర్.. ఐపీఎల్ సహా దేశవాళీ క్రికెట్ లో తన అద్భుత ప్రతిభను కనబర్చిన తరువాత కూడా న్యూజీలాండ్ తో జరిగిన తొలి టెస్టుకు ఆయన ఎంపిక కాలేదు, దీంతో విమర్శలు వెల్లివియడంతో.. ఆయన కూడా కాసింత ఘాటుగానే వ్యాఖ్యానించాడు. జాతీయ జట్టుకు ఎంపిక కానంత మాత్రన తాను ఒడినట్టు కాదు.. తన సహచరులు గెలిచినట్లు కాదని కూడా వ్యాఖ్యానించాడు. అది కాస్తా రాజుకుని ఏకంగా బిసిసిఐ కెప్టెన్, కోచ్ లపై విమర్శలకు దారితీసింది.
ఈ నేపథ్యంలో ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరగనున్న రెండో టెస్టుకు ఆయనను ఎంపిక చేశామని పిలుపు రావడంతో నిత్యం గంభీరంగా వుండే గౌతముడు కాస్తా చల్లించపోయాడు. దాదాపు రెండేళ్ల తరువాత తనకు తిరిగి టెస్టు జట్టులో చోటు దక్కడంపై స్టైలిష్ క్రికెటర్ గౌతమ్ గంభీర్, తన మనసులోని భావోద్వేగాలను దాచుకోలేకపోయాడు. కేఎల్ రాహుల్ గాయపడటంతో, గంభీర్ కు పిలుపురాగా, ఉబ్బితబ్బిబ్బవుతున్న ఈ 34 ఏళ్ల ఢిల్లీ బ్యాట్స్ మెన్, తనకిప్పుడు తొలి మ్యాచ్ అవకాశాన్ని పొందినట్టుగా ఉందని పేర్కొన్నాడు. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో పోస్టులు పెడుతూ, ఎంత అనుభవమున్నా, కొంత భయంగా, ఇంకొంత ఆందోళనగా ఉందని అన్నాడు.
ఎన్నో ఆశలతో ఈడెన్ గార్డెన్స్ కు వెళుతున్నట్టు తెలిపాడు. ఇక దేశానికి ప్రాతినిధ్యం వహించడం కన్నా తనకు మరేదీ ఎక్కవ కాదని, అది టెస్టు క్రికెట్ అయినా, తెలుపు లేదా ఎరుపు బాల్ అయినా ఒకటేనని అన్నాడు. ఇండియా క్యాప్ ధరించే అవకాశం తనకు మరోసారి ఇచ్చిన బీసీసీఐకి కతజ్ఞతలు చెప్పాడు. ఇటీవలి దులీప్ ట్రోఫీలో అర్ధ సెంచరీలు చేసి సత్తా చాటిన గంభీర్ కు న్యూజిలాండ్ తో కోల్ కతాలో జరిగే రెండో టెస్టుకు పిలుపు వచ్చిన సంగతి తెలిసిందే. ఆగస్టు 2014లో టెస్టు మ్యాచ్ ఆడిన గంభీర్ కు, నాటి పేలవ ప్రదర్శన కారణంగా మరోసారి చోటు లభించలేదు.
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్స్ట్రైకర్ ఎండ్లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more