భారత క్రికెట్ జట్టు ఆడిన 500వ చారిత్రక మ్యాచ్ పూర్తి చేసుకుని విజయాన్ని అందుకున్న నేపథ్యంలో టీమిండియాకు చెందిన ఇద్దరు కీలక అటగాళ్లను విస్మరించడంపై నిరసనలు వ్యక్తమవుతున్నాయి, ప్రసత్తం టెస్టు కెప్టెన్ గా వ్యవహరిస్తున్న విరాట్ కోహ్లీతో పాటుగా, ధోని కన్న ముందు టీమిండియాకు సేవలందించిన సౌరవ్ గంగూలీని కూడా విస్మరించడం అభిమానులను అగ్రహానికి గురిచేసింది, ముఖ్యంగా గంగూలీ అభిమానులు బిసిసిఐ తీరుపై మండిపడుతున్నారు.
టెస్టు యావరేజ్లో విరాట్ మెరుగ్గా ఉన్నా స్థానం దక్కకపోవడంపై పలువురు విశ్లేషకులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. కాగా, డ్రీమ్ టెస్టు ఎలెవన్ జట్టులో యువరాజ్ సింగ్ కు 12వ ఆటగాడిగా స్థానం కల్పించారు. ఇక్కడ యువరాజ్ కంటే కోహ్లి సగటు బాగుండటమే చర్చకు దారి తీసింది. 2012లో చివరిసారి టెస్టు మ్యాచ్ ఆడిన యువరాజ్ ఈ ఫార్మాట్లో 33.92 యావరేజ్ తో ఉండగా, విరాట్ కోహ్లి టెస్టు యావరేజ్ 45.06 గా ఉంది. దాంతో పాటు ఈ టీమ్లో భారత అత్యుత్తమ కెప్టెన్లలో ఒకడైన సౌరవ్ గంగూలీకి కూడా చోటు లభించలేదు. భారత జట్టుకు దూకుడు నేర్పిన గంగూలీ తన టెస్టు కెరీర్లో 116 మ్యాచ్లు ఆడటంతో పాటు 16 సెంచరీలు, 35 హాఫ్ సెంచరీలు నమోదు చేశాడు. అతని టెస్టు యావరేజ్ 42.17 గా ఉంది. దాంతో పాటు 32 వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు.
గతవారం డ్రీమ్ టెస్టు జట్టును ప్రకటించిన భారత క్రికెట్ కంట్రలో బోర్డు(బీసీసీఐ).. తాజాగా వారికి ఓటింగ్ను నిర్వహించింది. ఈ మేరకు భారత డ్రీమ్ టెస్టు ఎలెవన్ కు నిర్వహించిన క్రికెట్ అభిమానలు ఓటింగ్లో రాహుల్ ద్రవిడ్ అత్యధికంగా 96శాతాన్ని దక్కించుకున్నాడు. ఆ తరువాత స్థానాల్లో అనిల్ కుంబ్లే(92శాతం), కపిల్ దేవ్(91 శాతం), ఎంఎస్ ధోని(90శాతం)లు ఉన్నారు. కాగా ఈ ఓటింగ్ లో సచిన్ టెండూల్కర్కు 73 శాతం ఓటింగ్ రాగా, వీరేంద్ర సెహ్వాగ్ 86 శాతం సాధించాడు. అయితే స్టైలిష్ ఆటగాడు వీవీఎస్ లక్ష్మణ్ 58 శాతం ఓటింగ్తో 12వ ఆటగాడిగా ఎంపికైన యువరాజ్ సింగ్(62శాతం) కంటే వెనుక ఉండటం గమనార్హం.
భారత జట్టు అత్యుత్తమ డ్రీమ్ టెస్టు జట్టు ఇది: ఎంఎస్ ధోని(కెప్టెన్), సునీల్ గవాస్కర్, వీరేంద్ర సెహ్వాగ్, రాహుల్ ద్రవిడ్, సచిన్ టెండూల్కర్, వీవీఎస్ లక్ష్మణ, కపిల్ దేవ్, రవి చంద్రన్ అశ్విన్, అనిల్ కుంబ్లే, జవగళ్ శ్రీనాథ్, జహీర్ ఖాన్, యువరాజ్ సింగ్(12వ ఆటగాడు
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్స్ట్రైకర్ ఎండ్లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more