చారిత్రక టెస్టులో టీమిండియా ప్రధాన స్పిన్నర్ రవి చంద్రన్ అశ్విన్ విజృంభణ కొనసాగింది. ఈ మ్యాచ్లో అశ్విన్ మొత్తం పది వికెట్లతో రాణించి న్యూజిలాండ్ వెన్నువిరిచాడు. తొలి ఇన్నింగ్స్లో నాలుగు వికెట్లు తీసిన అశ్విన్.. రెండో ఇన్నింగ్స్లో ఆరు వికెట్లతో సత్తా చాటాడు. అయితే రెండో ఇన్నింగ్స్లో ఆరు వికెట్లను తీసే క్రమంలో తొలి మూడు వికెట్లను దక్కించుకున్న అశ్విన్.. చివరి మూడు వికెట్లను కూడా తన ఖాతాలోనే వేసుకోవడం విశేషం. చివరి మూడు వికెట్లను పడగొట్టే క్రమంలో నిలకడగా ఆడుతున్న సాంట్నార్ను ముందుగా అశ్విన్ అవుట్ చేశాడు.ఆ తరువాత సోథీ, వాగ్నర్లు కూడా అశ్విన్ మాయాజాలంలో పడి పెవిలియన్ కు చేరారు.
సోథీని బౌల్డ్ చేసిన అశ్విన్.. వాగ్నర్ను ఎల్బీడబ్యూగా అవుట్ చేసి భారత్ విజయం ఖాయం చేశాడు. అంతకుముందు న్యూజిలాండ్ రెండో ఇన్నింగ్స్లో తొలి మూడు వికెట్లను అశ్విన్ సాధించిన సంగతి తెలిసిందే. టాపార్డర్ ఆటగాళ్లు లాథమ్, గప్టిల్, విలియమ్సన్ లు అశ్విన్ బౌలింగ్ లో పెవిలియన్ కు చేరారు. ఈ క్రమంలో200 టెస్టు వికెట్ల క్లబ్లో చేరడమే కాకుండా, అత్యంత వేగవంతంగా టెస్టు వికెట్లు సాధించిన రెండో బౌలర్గా అశ్విన్ అరుదైన ఘనత సాధించాడు. ప్రత్యేకంగా రెండో ఇన్నింగ్స్ లో భారత్ కు అద్భుతమైన ఆరంభాన్నిచ్చిన అశ్విన్.. మ్యాచ్ కు ఘనమైన ముగింపు ఇచ్చాడు. దాంతో భారత్ 197 పరుగుల తేడాతో భారీ విజయం సాధించింది. కివీస్ తన రెండో ఇన్నింగ్స్లో 236 పరుగులకే చాపచుట్టేయడంతో భారత్కు చారిత్రక విజయం లభించింది.
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్స్ట్రైకర్ ఎండ్లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more