అస్ట్రేలియాతో జరిగిన టెస్టు సిరీస్ ఓటమి తరువాత టెస్టు క్రికెట్ నుంచి వీడ్కొలు ప్రకటించిన మహేంద్ర సింగ్ ధోనీ నుంచి కెప్టెన్సీ పగ్గాలను అందుకున్న టీమిండియా డాషింగ్ బ్యాట్స్ మెన్ విరాట్ కోహ్లీ ఇప్పటికే జింబాబ్వే, శ్రీలంకపై సిరీస్ విజయాలను తన ఖాతాలో వేసుకున్నాడు. అయితే జట్టుకు కెప్టెన్ అయినప్పటికీ తాను ఓ సాధారణ బ్యాట్స్ మన్ తరహాలోనే ఆలోచిస్తుంటానని కోహ్లీ తెలిపాడు. బ్యాటింగ్ సమయంలోనే తన ఇన్నింగ్స్ ను ఎప్పటికప్పుడు కెప్టెన్సీ బాధ్యత గుర్తుచేస్తుందని అన్నాడు.
అయితే ఫీల్డింగ్ చేస్తున్నప్పుడు తన ఆలోచన తీరు అలాగే ఉంటుందని.. దాంతో ఆటగాళ్లను సరైన స్థానాల్లో ఉంచి ఫీల్డింగ్ చేయించడం సులభమన్నాడు. బ్రాత్ వైట్ ఔట్ విషయంలో అటాకింగ్ ఫీల్డింగ్ సత్ఫలితాన్ని ఇచ్చిందని, బ్యాట్స్ మన్ బాడీ లాంగ్వేజ్ అర్థం చేసుకోవాలంటే తాను కూడా బ్యాట్స్ మన్ తరహాలో ఆలోచించడం ఉత్తమమని అభిప్రాయపడ్డాడు. కాగా అంటిగ్వాలోని సర్ వివియన్ రిచర్డ్స్ స్టేడియంలో జరిగిన తొలి టెస్టులో వెస్టిండీస్ పై ఇన్నింగ్స్ 92 పరుగుల విజయం జట్టులో ఆత్మవిశ్వాసాన్ని పెంచిందన్నాడు.
560-70 పరుగులు చేస్తే ప్రత్యర్థిపై ఒత్తిడి ఉంటుందని, అదే విజయానికి బాటలు వేసిందని విరాట్ చెప్పుకొచ్చాడు. కోచ్ అనిల్ కుంబ్లేను ప్రశంసించాడు. అతడు కోచ్ అయ్యాక.. బెంగళూరులో ప్రాక్టీస్ సెషన్లో పాల్గొన్నాం, కరీబియన్ వచ్చాక హార్స్ రైడింగ్, బీచ్ గేమ్స్ స్విమ్మింగ్, టూరిస్ట్ ప్రదేశాలు సందర్శించాం.. ఇలా అన్నీ చేస్తూనే కుంబ్లే శిక్షణలో నిమగ్నమైనట్లు వివరించాడు. ఈ విజయం ఏ ఒక్కరిదో కాదని, బ్యాట్స్ మన్, బౌలర్లు సమిష్టిగా రాణించడంతో అద్భుత విజయం టీమిండియా సొంతమైందని కోహ్లీ పేర్కొన్నాడు.
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్స్ట్రైకర్ ఎండ్లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more