వెస్టిండీస్ పర్యటనలో నాలుగు టెస్టు సిరీస్ లలో భాగంగా అటింగ్వాలోని సర్ వివియన్ రిచర్డ్స్ స్టేడియంలో జరిగిన తొలి టెస్టులో భారత బ్యాట్స్ మెన్లతో పాట, టీమిండియా బౌలర్లు కూడా తమ సత్తాను చాటారు. ఫలితంగా తొలి మ్యాచ్ ను తమ ఖాతాలోకి వేసుకున్నారు. ఆతిథ్య వెస్టిండీస్తో నాలుగు టెస్టుల సిరీస్లో భాగంగా ఇక్కడ జరిగిన తొలి మ్యాచ్లో టీమిండియా ఇన్నింగ్స్ 92 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో సిరీస్లో 1-0తో ఆధిక్యంలో నిలిచింది. ఉమేష్ (4/41), షమి (4/66), మిశ్రా (2/43) విజృంభణతో.. తొలి ఇన్నింగ్స్లో 243 పరుగులకే వెస్టీండీస్ కుప్పకూలింది.
భారత్ తొలిఇన్నింగ్స్ లో సాధించిన స్కోరులో సగం కూడా చేయలేని స్థితిలో ఫాలో అన్ గండం ఎదురైంది. దీంతో సెకండ్ ఇన్నింగ్స్ ను ప్రారంభించిన వెస్టిండిస్ ను స్పిన్నర్లు అమాంతం కూల్చేశారు. ఆఫ్ స్పిన్నర్ అశ్విన్ (7/83) మ్యాజిక్ చేయడంతో కరీబియన్ జట్టు 231 పరుగులకే చేతులెత్తేసింది. మార్లోన్ శామ్యూల్స్ (50) రాణించాడు. 132కే ఎనిమిది వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన దశలో కార్లోస్ బ్రాతవైట్ (51 నాటౌట్), దేవేంద్ర బిషూ (45) రాణించినా విండీస్ను ఇన్నింగ్స్ ఓటమి నుంచి తప్పించలేకపోయారు. అంతకుముందు ఓవర్నైట్ స్కోరు 21/1తో విండీస్ నాలుగో రోజు రెండో ఇన్నింగ్స్ను కొనసాగింది.
తొలి ఇన్నింగ్స్ను 566/8 వద్ద డిక్లేర్ చేసిన టీమిండియాను ఇన్నింగ్స్ 92 పరుగులతో విజయతీరాలకు చేర్చింది బౌలర్లే. ముఖ్యంగా సెకెండ్ ఇన్నింగ్స్ లో అశ్విన్ స్పిన్ మాయాజాలం రక్తికట్టి విండీస్ అటకట్టించింది. ఉదయం సెషన్ తొలి ఓవర్లోనే డారెన్ బ్రావోను అవుట్ చేసిన ఉమేష్ విండీస్ పతనానికి నాంది పలికాడు. ఆ తర్వాత అశ్విన్ మాయాజాలం మొదలైంది. చంద్రిక (31), బ్లాక్వుడ్ (0), శామ్యూల్స్ (50), ఛేజ్ (8), హోల్డర్ (16)లను అశ్విన్ పెవిలియన్కు చేర్చాడు.
దీంతో 132 పరుగులకే 8 వికెట్లు కోల్పోయిన విండీస్ను బ్రాతవైట్, బిషూ ఆదుకునే ప్రయత్నం చేశారు. తొమ్మిదో వికెట్కు 95 రన్స్ జోడించారు. చివర్లో బిషూ, గాబ్రియెల్ కూడా అశ్విన్కే చిక్కడంతో భారతకు విజయం దక్కింది. టీమిండియా బౌలర్లలో అశ్విన్ 25 ఓవర్లలో 7 వికెట్లు తీసుకోగా, ఉమేష్ 13 ఓవర్లలో 4 వికెట్లు, షమి 10 ఓవర్లలో 3 వికెట్లు, అమిత్ మిశ్రా 19 ఓవర్లలో 3 వికెట్లు, ఇషాంత్ శర్మ 11 ఓవర్లలో రెండు వికెట్లతో రాణించారు.
స్కోరు వివరాలు
భారత్ తొలి ఇన్నింగ్స్: మొత్తం 161.5 ఓవర్లలో 566/8 డిక్లేర్డ్.
వెస్టిండీస్ తొలి ఇన్నింగ్స్: 90.2 ఓవర్లలో 243 ఆలౌట్.
వెస్టిండీస్ రెండో ఇన్నింగ్స్ : 78 ఓవర్లలో 231 ఆలౌట్
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్స్ట్రైకర్ ఎండ్లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more