టీమిండియా పరిమిత ఓవర్ల క్రికెట్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ అభిమానులు సీనియర్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ ను టార్గెట్ చేశారు. ట్విట్టర్ వేదికగా ధోనీ అభిమానులు భజ్జీపై మాటల యుద్ధంతో దాడి చేశారు. ఇంతకీ ధోనీ అభిమానులు భజ్జీపై ఆగ్రహం వ్యక్తం చేయడానికి.. టీమిండియా మాజీ కెప్టెన్ సౌరబ్ గంగూలీ బర్త్ డే పరోక్షంగా కారణమైంది. దాదాకు బర్త్ డే విషెస్ తెలుపుతూ భజ్జీ ట్విట్టర్ను అనుసంధానం చేసుకున్నాడు. అంతటితో అగకుండా తన అభిప్రాయాన్ని కూడా వ్యక్తం చేశాడు. అదేంటి అంటారా..?
టీమిండియా అత్యుత్తమ కెప్టెన్గా గంగూలీని భజ్జీ అభివర్ణించాడు. ఈ వ్యాఖ్యలే ధోనీ అభిమానులకు కోపం తెప్పించాయి. భజ్జీని విమర్శిస్తూ ధోనీ అభిమానులు ట్వీట్ చేశారు. ధోనీ భజ్జీని వాటర్ బాయ్ చేశాడని, జట్టులో లేకుండా చేసినందుకు నైరాశ్యంలో ఉన్నాడంటూ.. ధోనీ భజ్జీని పక్కనబెట్టి అశ్విన్కు ప్రాధాన్యం ఇచ్చినందుకు ఈర్ష్య పడుతున్నాడంటూ.. దాదా బెస్ట్ కెప్టెన్ అయితే, ధోనీ ఎవరు? అంటూ.. భజ్జీ ఇలా ట్వీట్ చేసినందుకు టీమిండియాకు మళ్లీ ఎంపికకాడంటూ.. భారత క్రికెట్లో రమేష్ పవార్ అత్యుత్తమ ఆఫ్ స్పిన్నర్ అంటూ... నెటిజెన్లు సెటైర్లు వేశారు.
దాదా తన నాయకత్వంలో భజ్జీ, యువరాజ్, సెహ్వాగ్, జహీర్ వంటి ఆటగాళ్లను ప్రోత్సహించాడు. భజ్జీకి కూడా దాదాతో ప్రత్యేక అనుబంధముంది. టీమిండియా కెప్టెన్లుగా ధోనీ, గంగూలీ ఇద్దరూ విజయవంతయ్యారు.. జట్టును ఉన్నత స్థాయికి తీసుకెళ్లి ఎన్నో విజయాలు అందించారు.. అయితే ఈ ఇద్దరిలో ఎవరు గొప్ప అనే విషయంలో అభిప్రాయాలు వేరుగా ఉన్నాయి. అయితే ఎవరి అభిప్రాయాలు వారికి. ఒకరు అభిప్రాయాలను వ్యక్తం చేసిన తరువాత.. వాటిని ప్రభావితం చేసేలా మరో క్రికెటర్ అభిమానులు అయనను టార్గెట్ చేస్తూ విమర్శలకు దిగడం సహేతుకం కాదని, ఇది క్రీడాస్పూర్తి భంగం కలిగిస్తుందని కూడా క్రీడా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
మనోహర్
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్స్ట్రైకర్ ఎండ్లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more