ఐపీఎల్-9 తొలి దశలో ముగిసి.. ప్లే ఆఫ్ అంకానికి చేరింది. దీంతో ఇవాళ రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో గుజరాత్ లయన్స్ తొలి క్వాలిఫయర్ లో తలపడింది. అయితే ఈ మ్యాచ్ లో గుజరాత్ లయన్స్ చెత్త రికార్డును మూటగట్టుకుంది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ లయన్స్ పవర్ ప్లే(తొలి ఆరు ఓవర్లు) ముగిసే సరికి మూడు వికెట్లు కోల్పోయి 23 పరుగులు చేసింది. దీంతో ఓవరాల్ ఐపీఎల్లోని పవర్ ప్లేలో ఆర్సీబీపై అత్యల్ప స్కోరు నమోదు చేసిన జట్టుగా చెత్త రికార్డును తన ఖాతాలో వేసుకుంది.
అంతకుముందు 2009 లో మాత్రమే రాజస్థాన్ రాయల్స్ పవర్ ప్లేలో ఆర్సీబీపై 14 పరుగులు చేసిన తరువాత ఇప్పుడు గుజరాత్ లయన్స్ చెత్త రికార్డు నమోదు చేసుకుంది. మరోవైపు ఓపెనర్లు ఇద్దరూ ఐదు పరుగులు మాత్రమే నమోదు చేసి పెవిలియన్ కు చేరడం ఈ ఐపీఎల్లో గుజరాత్ కు ఇదే ప్రథమం. టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన గుజరాత్ లయన్స్కు ఆదిలోనే గట్టి ఎదురుదెబ్బ తగిలింది. గుజరాత్ ఆటగాళ్లు బ్రెండన్ మెకల్లమ్(1), అరోన్ ఫించ్(4) నిరాశపరచగా, కెప్టెన్ సురేష్ రైనా(1) నిష్కమించి తీవ్రంగా నిరాశపరిచారు.
ఆ తరుణంలో దినేష్ కార్తీక్(26; 30 బంతుల్లో 2 ఫోర్లు), డ్వేన్ స్మిత్ (73;41 బంతుల్లో 5 ఫోర్లు, 6 సిక్సర్లు) జోడి రాణించడంతో గుజరాత్ తేరుకుంది. ఈ జోడి నాల్గో వికెట్ కు 85 పరుగులు భాగస్వామ్యాన్ని జత చేశారు. ఈ క్రమంలోనే స్మిత్ హాఫ్ సెంచరీ సాధించాడు. అనంతరం రవీంద్ర జడేజా(3) ఐదో వికెట్ గా అవుట్ కాగా, ఆరో వికెట్ గా స్మిత్ పెవిలియన్ చేరాడు. ఇక చివర్లో డ్వేన్ బ్రేవో (8) నిరాశపరిచినా, ద్వివేది(19;9 బంతుల్లో 1 ఫోర్, 2 సిక్సర్లు) బ్యాట్ ఝుళిపించడంతో గుజరాత్ నిర్ణీత ఓవర్లలో 158 పరుగులు చేసింది. ఆర్సీబీ బౌలర్లలో షేన్ వాట్సన్ నాలుగు వికెట్లు సాధించగా, జోర్డాన్, ఇక్బాల్ అబ్దుల్లాలకు తలో రెండు వికెట్లు, చాహల్ కు ఒక వికెట్ దక్కింది.
మనోహర్
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్స్ట్రైకర్ ఎండ్లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more