భారత్ తో జరిగిన రెండో టీ20 మ్యాచ్ లో శ్రీలంక పేస్ బౌలర్ తిషారా పెరీరా అరుదైన ఘనతను సొంతం చేసుకున్న లంక ఆశ్చర్యకర విషయాన్ని వెల్లడించాడు. భారత ఇన్నింగ్స్ 19వ ఓవర్లో హ్యాట్రిక్ వికెట్లు టీ20ల్లో ఆ ఘనత సాధించిన తొలి లంక బౌలర్ గా నిలిచాడు. అయితే, హ్యాట్రిక్ వికెట్లు తీసిన విషయమే తనకు తెలియలేదని పెరీరా చెప్పాడు. తాను కేవలం వికెట్లు తీయడం, పరుగులు కట్టడం చేయడంపైనే దృష్టిసారించడంతో ఈ విషయాన్ని పట్టించుకోలేదని వివరించాడు. 19వ ఓవర్ వేసిన పెరీరా తొలుత కొన్ని బంతులను వైడ్లు వేశాడు. ఆ ఓవర్ నాల్గో బంతికి పాండ్యాను అవుట్ చేసిన పెరీరా, ఆ తరువాత ఐదు, ఆరు బంతులకు రైనా, యువరాజ్ లను పెవిలియన్ బాట పట్టించాడు. యువరాజ్ డకౌట్(0) గా వెనుదిరిగాడు. ఆ మ్యాచ్ లో పెరీరా 3 ఓవర్లు వేసి 3 వికెట్లు తీసి 33 పరుగులు ఇచ్చాడు.
ఓవరాల్ గా తనకు ఇది రెండో హ్యాట్రిక్ అని, గతంలో పాక్ తో జరిగిన వన్డే మ్యాచ్ లో తొలిసారి ఈ ఫీట్ సాధించినట్లు పెరీరా చెప్పాడు. టాస్ గెలిస్తే బౌలింగ్ చేయాలని తమ జట్టు ముందే డిసైడ్ అయినట్లు వివరించాడు. టీమిండియా బ్యాటింగ్ ఒక్క కారణం వల్లే తమ జట్టు ఓటమి పాలైందని లంక బౌలర్ అభిప్రాయపడ్డాడు. ధావన్ అద్బుతంగా బ్యాటింగ్ చేశాడు.. అశ్విన్ తన బౌలింగ్ తో తమ బ్యాట్స్ మన్ ను ఇబ్బంది పెట్టాడని రెండో టీ20 ఓటమి తర్వాత జరిగిన ప్రెస్ కాన్ఫరెన్స్ లో ఈ వివరాలు చెప్పుకొచ్చాడు. ఓవరాల్ గా టీ 20ల్లో హ్యాట్రిక్ సాధించిన నాల్గో ఆటగాడిగా పెరీరా గుర్తింపు పొందాడు. అంతకుముందు బ్రెట్ లీ, జాకబ్ ఓరమ్, టీమ్ సౌతీలు హ్యాట్రిక్ లు ఈ ఫీట్ నెలకొల్పారు.
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్స్ట్రైకర్ ఎండ్లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more