ఆడలేక మద్దెల ఓడన్నట్లు ఉంది టీమిండియా వన్డే, టీ-20 కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని వ్యవహారం. విదేశాల్లోనే కాదు స్వదేశంలో మ్యాచ్ లు ఓడిన ప్రతీసారి.. మా ఓటమి కారణం అదేనంటూ ఆయన కొత్త రాగాన్ని ఎత్తుకుంటున్నారు. విదేశాలలో ఆడేటప్పుడు అంపైర్ల తప్పుల వల్లే ఓడిపోయామని చెప్పేన భారత క్రికెటర్లు.. సొంత దేశంలో కూడా అదే పల్లవి అందుకుంటున్నారు. దక్షిణాఫ్రికాతో హిమాచల్ ప్రదేశ్ లోని ధర్మశాలలో జరిగిన టి-20 మ్యాచ్లో స్లాగ్ ఓవర్లలో బ్యాటింగ్ వైఫల్యం కారణంగా ఓటమిని మూటగట్టుకున్న టీమిండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ.. ఆ నెపాన్ని అంపైర్ల మీదకు నెట్టేశాడు.
దక్షిణాఫ్రికా బ్యాట్స్మన్ డుమినీ చేసిన 68 పరుగులే ఆ జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాయని చెప్పిన ధోని.. ఆయన క్రీజ్ లో నిల్చున్నంత సేపటిలో రెండు సార్లు ఎల్బీడబ్యూ చేసినట్లు అప్పీలు చేశామని గుర్తుచేశారు. అయితే రెండుసార్లు భారత బౌలర్లు డుమినీని ఎల్బీడబ్ల్యు చేసినట్లు అప్పీలు చేసినా, అంపైర్లు మాత్రం వాళ్లతో ఏకీభవించలేదు. ఆ రెండు సార్లూ అతడు అవుటయినట్లే ఉందని, ఇలాంటి కొన్ని నిర్ణయాల వల్ల మ్యాచ్ మొత్తం మారిపోతుందని ధోనీ వ్యాఖ్యానించాడు. డుమినీ ముందే అవుటైతే ఫలితం వేరేలా ఉండేదని అన్నాడు. చేతిలో మంచి స్కోరు ఉన్నా కూడా.. మన ఫాస్ట్ బౌలర్లు ప్రత్యర్థులను కట్టడి చేయడంలో అంతగా విజయం సాధించలేక పోయారని నర్మగర్భవ్యాఖ్యలు చెశాడు.
జి. మనోహర్
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్స్ట్రైకర్ ఎండ్లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more